మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 60 సంత్సరాలు దాటింది. కానీ మన జాతీయ గీతానికి మాత్రం వందేళ్ళు నిండబోతున్నాయి. తొలిసారిగా మనకు స్వాతంత్ర్యం రాక ముందు 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా జనగణమన పాడారు. నూరేళ్లు గడచినా ఇది నిత్య నూతనం, అదే మాధుర్యం, అదే పారవశ్యం. ఈ పవిత్ర జాతీయ గీతం జన గణంలోకి ప్రవహించి... ఎల్లుండికి సరిగ్గా వందేళ్లు. వందేళ్ల జనగణమన విశేషాలు కొన్ని మీ కోసం...
ఆసేతు హిమాచలాన్ని ఇముడ్చుకున్న గీతం 'జనగణమన'. వందేళ్ల నిత్య నూతన గీతం జనగణమన. మన జాతీయ గీతం గురించి చెప్పుకోవాలంటే ఎన్నో విశేషాలున్నాయి. అందులో కొన్ని ఇవి... * బెంగాలీ బాబు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ విరచిత గీతమిది. సంస్కృత సమ్మిళతమైన (తత్సమ) బెంగాలీలో దీనిని రచించారు.
* జనగణమనను మొట్టమొదటిసారిగా 1911 డిసెంబర్ 27న కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు.
* రాజ్యాంగ సభ 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా ఆమోదించింది.
* 'జనగణమన'ను భారత దేశ సుప్రభాత గీతం (ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా)గా రవీంద్రుడు అభివర్ణించారు.
* జనగణమనలో ఐదు చరణాలు ఉన్నప్పటికీ... అప్పటి పరిస్థితుల కారణంగా మొదటి చరణాన్ని మాత్రమే జాతీయ గీతంగా స్వీకరించారు.
* ప్రస్తుతం మనం పాడుకుంటున్న జనగణమనకు రామ్సింగ్ ఠాకూర్ సంగీతాన్ని అందించినట్లు చెబుతారు. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి.
* జనగణమన పాడేందుకు 52 క్షణాల సమయం పడుతుంది. మొదటి, చివరి పంక్తులు మాత్రమే ఉన్న సంక్షిప్త రూపాలాపనకు దాదాపు 20 క్షణాలు పడుతుంది.
* 'వందేమాతరం' జనగణమనకంటే ముందే పుట్టింది. బ్రిటిష్ వ్యతిరేక గీతంగా... స్వాతంత్య్రోద్యమ నినాదంగా జనంలోకి వెళ్లింది.
* అప్పట్లో... వందేమాతర గీతం ఆలపించడం రాజద్రోహం. జనగణమనను మాత్రం బ్రిటిష్ పాలకులు గౌరవించేవారు.
* స్వాతంత్య్రానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో, స్కౌట్ బృందాలలో జనగణమనను ఆలపించేవారు.
* జనగణమనపై బ్రిటిష్ పాలకులకు అంత గౌరవం ఉండటానికి కారణం... ఇది జార్జి-5 పట్టాభిషేక సమయంలో ఆయనను కీర్తిస్తూ రచించారనే ప్రచారం జరగడమే!
* అప్పటికి భారత జాతీయ కాంగ్రెస్ కూడా బ్రిటిష్ పాలకులపట్ల విధేయత ప్రదర్శించేది. రాజుకు, రాణికి భారత్లోకి స్వాగతం పలుకుతూ కలకత్తా సమావేశంలో ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించారు.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంత్యుత్సవాలు జరుగుతున్న సమయంలోనే.. ఆయన రాసిన 'జనగణమన'కు శతవర్షాలు నిండాయి. ఈ సందర్భంగా మంగళవారం ముంబైలో షణ్ముఖానంద సంగీత సభ విద్యార్థులు 'జనగణమన' పూర్తి పాఠాన్ని ఆలపించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more