నిన్న పార్లమెంటులో లోక్ పాల్ ప్రవేశపెట్టిన తర్వాత చర్చల్లో ఆర్ జెడి పార్టీ అధ్యక్షుడు లల్లూ ప్రసాద్ యాదవ్ నుండి, సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్ గుప్తా నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దాస్ గుప్తా మాట్లాడుతూ దేశానికి ఒకరే జాతిపిత ఉన్నారు. మేమంతా ప్రజాప్రతినిధులుగా పనిచేస్తుంటే ఇప్పుడొకాయన జాతిని ఉద్ధరించే జాతిపితగా అవతారమెత్తి తనే అవినీతినంతా కడిగేసే ఒకేఒక్క యోధుడిగా చెప్పుకుంటున్నాడు అంటూ అన్న హజారే పేరెత్తకుండా ఆయనని ఉద్దేశించి అనటంతో చాలామంది డెస్క్ ల మీద చేతులతో కొట్టారు. అందులో యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా ఉన్నారు. ఈ సత్యాగ్రహాలకూ బెదిరింపులకూ వెరవకండి భారత దేశ సార్వభౌమత్వానికి తలవంపులు తేకండి అని దాస్ గుప్తా అన్నారు.
లల్లూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ పార్లమెంటులో చట్టాలు తయారు చెయ్యటానికి ప్రజాప్రతినిధులం మనమున్నాం. ఎవరో ఏదో నిరాహార దీక్ష చేస్తానంటే చెయ్యనివ్వండి, అది ఆయన ఆరోగ్యానికి మేలు చేస్తుందేమో అంటూ, అయినా ఆయన తన వయసునీ ఆరోగ్యాన్ని చూసుకోవాలంటూ అన్నాకో సలహా కూడా పడేసారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన లోక్ పాల్ బిల్లుతో పాటు అందులోని 97వ క్లాజ్ కి వివరణాత్మకంగా ఆర్థిక మంత్రి జతపరచిన మెమోరాండంలో లోక్ పాల్ వలన ప్రభుత్వానికి అదనంగా ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు కట్టి చెప్పారు. లోక్ పాల్ నిర్వహణకు మున్ముందుగా 100 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, ఒకవేళ తమకంటూ ప్రత్యేకమైన భవనాలు కావాలనుకుంటే ఆ ఖర్చు 400 కోట్ల రూపాయలకు చేరవచ్చునని, అది కాకుండా సాలీనా 200 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే వాటి వివరాలను ఇప్పుడే బయటకు తెలియజేయలేనని ప్రణబే ముఖర్జీ అన్నారు.
ప్రభుత్వం అనవసరంగా భయపడుతూ అన్నా బెదిరింపులకు లొంగుతోందని అంటున్నవారిలో శివసేన, ఆర్ జె డి, సిపిఐ, బహుజన సమాజ్, అన్నా డిఎమ్ కే, బిజ్జూ జనతా దళ్ పార్టీలున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more