శీతాకాలం సమావేశాల్లో ఎప్పటిలాగానే ఈ రోజు కూడా సభలు మళ్ళీ వాయిదా పడ్డాయి. కారణమూ అదే విపక్షాల ఆందోళన, చర్చలను ముందుకు సాగనివ్వకపోవటం. ఈ రోజు దేనిమీద వివాదమన్నది తర్వాత సంగతి కానీ వివాదమైతే మామూలైపోయింది, అందుకు సమాధానంగా వాయిదాలు వెయ్యటమూ మామూలైపోయింది. సభ సజావుగా సాగితే వార్త అయ్యే పరిస్థితి వచ్చింది.
ఈ రోజు హోం మంత్రి చిదంబరం రాజీనామా చెయ్యాలని పట్టుబడుతూ ఆందోళన సాగింది. అందుకు తాజా కారణం నిన్న వార్తా పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం చిదంబరం ఎస్ పి గుప్తా అనే తన క్లెయింట్ మీద దర్యాప్తు జరగకుండా తన హోదాని వాడుకున్నారు. మొదట్లో ఎఫ్ డి ఐ మీద ఆందోళన చేస్తూ ఉపసంహరించుకోమని, ఆ తర్వాత ధరల పెరుగుదల మీదా, అ తర్వాత నల్లధనం మీదా, మధ్యలో ఒకసారి 2జి కేసులో చిదంబరం ప్రమేయం దృష్ట్యా ఆయన రాజీనామా కోరుతూ ఈ రోజు మళ్ళీ కొత్తగా వార్తల్లోకి వచ్చిన కథనం దృష్ట్యా చిదంబరం రాజీనామా చెయ్యాలని మరోసారి పట్టుబడుతూ ఇలా శీతాకాలం సమావేశాలు చిక్కిపోయి 5 రోజులు మిగిలివున్నాయింకా.
ఎస్ పి గుప్తా మీద 1999లో చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లతోకూడా లెటర్ హెడ్ లను ఉపయోగించినట్టుగా ఆరోపణలను ఎదుర్కుంటున్న గుప్తా కి లోగడ చిదంబరం న్యాయవాదిగా పనిచేసారు. కానీ ఆ సంగతేమీ గుర్తులేదని చిదంబరం సెక్రటరీలు అంటున్నారు. గుప్తా తన మీద కేసులను కొట్టివేయాలని హోం మంత్రిత్వ శాఖకి అభ్యర్థన పెట్టుకోగా, దీనిమీద న్యాయశాఖ మంత్రిత్వ శాఖకు రాసానని, గుప్తా మీద కేసులను ఉపసంహరించుకోమని ఢిల్లీ పోలీసులకు మే నెలలో ఆదేశాలు వెళ్ళాయి.
అయితే, గుప్తా మీద సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయని, ఆ కేసుల మీద విచారణ జరగాలని ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మరోసారి ఆదేశాలిచ్చారు. యూనియన్ హోం సెక్రటరీ చిదంబరం లేఖలో మర్మంగా రాసినట్టుగా చెప్తూ, న్యాయశాఖని అడిగామని రాసారు కానీ వారి సలహాలను తీసుకున్నామని రాయలేదని అన్నారు. ఈ వివాదాన్ని లేవనెత్తిన భాజపా ఆందోళన కొనసాగించటంతో ఉభయ సభలూ 12 గంటల వరకూ వాయిదా పడ్డాయి. 12 గంటలకు మళ్ళీ ప్రారంభమైన సభ మరోసారి అదే పరిస్థితి నెలకొనటంలో సోమవారానికి వాయిదా పడింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more