తెలంగాణ, రాయలసీమ, కోస్తా.. మూడు ప్రాంతాల్లో 25 నియోజక వర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతుందని, మూడు కోణాల్లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల ప్రాతిపదికన జరిగితేనే టిడిపికి మేలు జరుగుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా మూడు అంశాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర వహిస్తాయన్నది టిడిపి అంచనా. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ పని చేస్తుందని, ఈ విషయంలో తాము చేయగలిగింది ఏమీ లేదని అంటున్నారు. టిఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా తెలంగాణలో ఉప ఎన్నికలు జరగాలని కోరుకుంటోంది. అదే అంశం ఎన్నికల్లో ప్రాధాన్యత వహిస్తే అది టిఆర్ఎస్కు ఉపయోగపడుతుంది. ఇక వైఎస్సార్పై ఉన్న సానుభూతి ప్రధాన అంశంగా ఎన్నికలు జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ కోరుకుంటోంది. కడప, పులివెందుల ఉప ఎన్నికలు ఈ కోణంలోనే జరిగాయి. టిడిపి ప్రధానంగా అవినీతిపై విస్తృతంగా ప్రచారం సాగించినా, అది పని చేయలేదు. వైఎస్సార్ సానుభూతి ఎన్నికల్లో పని చేసింది.
ఉప ఎన్నికలను వైఎస్సార్ పేరు మీదనే ఎదుర్కోవాలని జగన్ కోరుకుంటున్నారు. జగన్తోపాటు వైఎస్సార్ సతీమణి విజయమ్మ కూడా ఉప ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తే సానుభూతి ప్రభావం ఉంటుందని ఇతర పార్టీల నేతలు సైతం భావిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్, వైఎస్సార్ సెంటిమెంట్ రెండూ ఉప ఎన్నికల్లో తెదేపాకు వ్యతిరేకంగా పని చేసేవే. ఇవికాకుండా అభ్యర్థులు ఎవరు? అనేది ప్రధానమైతే ఉప ఎన్నికల్లో మా ప్రభావం బాగానే ఉంటుందని టిడిపి నేతలు అంటున్నారు. అభ్యర్థులే ప్రధానం అనుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్కు అండగా నిలిచిన ఎమ్మెల్యేల్లో చాలామంది ఓడిపోతారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అభ్యర్థులే ప్రధానం అనుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్, టిడిపిల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని, ఈ పోటీ తమకు మేలే చేస్తుందని టిడిపి నేతల అంచనా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more