కిరణ్ ప్రభుత్వం పై పట్టుబట్టి తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. తనకు సంఖ్యా బలం లేకున్నా ఇతర పార్టీల బలం ఎంతో తెలుసుకోవడానికి ప్లాన్ వేసి సక్సెస్ అయ్యింది. ఇటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన బలం నిరూపించుకొని కుర్చీని కదలకుండా చేసుకున్నాడు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన చిరు పార్టీ అండ్ టీమ్ అదను చూసి అలకపాన్పు వేసింది. మేం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటే కొన్ని షరతులు ఉన్నాయని ఖరాఖండిగా చెప్పింది. దీంతో దిగొచ్చిన అధిష్టానం వాటికి ఒప్పుకుని అప్పటి వరకు పరిస్థితిని గట్టెక్కించింది. అధిష్టానం ఇచ్చిన ఆజ్ణతో చిరు శిబిరంలో సంతోషం వెల్లివిరిసింది. ఆ సంతోషాన్ని ఆస్వాదించక ముందే మళ్ళీ వారి ఆశల పై నీళ్ళు చల్లింది.
మంత్రివర్గంలో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఆశావహులకు, పీఆర్పీ నాయకులకు మళ్లీ నిరాశ. తెలంగాణ అంశం తేలే వరకూ మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ పరోక్ష సంకేతాలివ్వడంతో పదవుల కోసం వేచిచూస్తున్న ఎమ్మెల్యేలకు మరోసారి నిరాశ తప్పలేదు.సంక్రాంతికి విస్తరణ ఉంటుందన్న ప్రచారం నిన్న, మొన్నటి వరకూ జరిగింది. బడ్జెట్ సమావేశాలకు ముందు కొత్త మంత్రివర్గం కొలువు తీరుతుందన్న ప్రచారం జరిగింది. ఆ మేరకు మళ్లీ నేతల ఢిల్లీ యాత్ర లు మొదలయ్యాయి. అటు చిరంజీవి శిబిరంలోనూ ఆశలు చిగు రించాయి. మూడు, నాలుగు మంత్రి పదవులు దక్కుతాయని ఆశించారు. తాజాగా ఆజాద్ ఢిల్లీలో చేసిన ప్రకటనతో కాంగ్రెస్-పీఆర్పీ ఎమ్మెల్యేలు డీలా పడ్డారు. తెలంగాణ అంశం తేలేవరకూ మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చని నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలతో మళ్లీ నిరాశ అలుముకుంది. తెలంగాణ అంశం ఇప్పట్లో తేలేది కాదని, యుపీఏ భాగస్వామ్యపక్షాల అభిప్రాయ సేకరణ, రాష్ర్టంలో ప్రధాన పార్టీలతో అఖిలపక్షం వంటి ప్రక్రియ ఇప్పట్లో తేలేది కాదని, అందులోనూ కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో బిజీగా ఉండే అవకాశం ఉన్నందున రాష్ట్రంపై దృష్టి సారించే అవకాశాలు లేవంటున్నారు. దీంతో పీఆర్పీ పరిస్థితి తన బాధను కక్కలేక మింగలేక సతమతమయ్యే పరిస్థితితో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more