ఏడవ రోజు కూడా పార్లమెంటు ఏ చర్చలూ సాగించకుండానే ఎటువంటి ప్రతిపాదనలు చెయ్యకుండానే మరోసారి వాయిదా పడింది. ఎఫ్ డి ఐ ని ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షనేతలు చేస్తున్న ఆందోళనతో ఈ రోజు కూడా పార్లమెంటు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు మొదలైన పార్లమెంటు సమావేశాలు మొదలవుతూనే ఎఫ్ డి ఐ గొడవతో 12 గంటలకు, ఆ తర్వాత అదే అంశం సీరియల్లాగా కొనసాగటంతో సభాపతి మీరా కుమార్ రేపటికి వాయిదా వేసారు. కేంద్ర పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో కూడా పాలనలో ఉండటం వలన, రేపు ప్రారంభమౌతున్న శాసన సభలోని సన్నివేశానికి పార్లమెంటు లోని దృశ్యాలు ట్రయల్ పార్ట్ లా కనిపిస్తున్నాయి. ఇక్కడి సమావేశాల్లో ఎంతెంత ఆవేశాలు ఎదురు చూస్తున్నాయో అంచనా వేసుకోవటానికి పనికి వస్తున్నాయి.
ప్రత్యేక తెలంగాణా కోసం ఎంపీలు ప్లకార్డులతో లేచి నిలబడి నినాదాలు చెయ్యటం, తృణమూల్ కాంగ్రెస్, డిఎమ్ కే సభ్యులు ఎఫ్ డి ఐ వాపస్ లేలో అంటూ ప్లకార్డులను పట్టుకుని లేచి నిలబడి నిరసన తెలియజేయటం, తెదేపా, సిపిఎమ్, శివసేన సభ్యులు స్పీకర్ దగ్గర వెల్ లోకి వెళ్ళి గట్టిగా నినదించటంతో పార్లమెంటు సమావేశాలు ఏడవ రోజు కూడా వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లోనూ పరిస్థితి ఇలాగే ఉండటంతో రేపటికి వాయిదా పడ్డ సమావేశాలు సజావుగా సాగాలంటే ప్రభుత్వానికి దిగిరాక తప్పని పరిస్థితి ఉంది. ఈ శీతాకాల సమావేశాల్లో పెట్టుకున్న అజెండా సుసంపూర్ణమవాలంటే ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒక అవగాహనకు రాక తప్పదు. ఇప్పడు సడలిస్తే మరోసారి అవకాశం దొరకదని ప్రతిపక్షాలు, ఇలా ప్రతిదానికీలొంగితే లోకవవుతామేమోనని పాలకపక్షం పట్టుబట్టి కూర్చుంటే చట్ట సభలు కూడా చతికిలపడి కూర్చుంటాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more