భారతదేశ చరిత్రలో కాకతీయ సామ్రాజ్యానికి ఒక అరుదైన ఘనత వున్న విషయం తెలిసిందే! కాకతీయ రాజ వంశం కీర్తిని నలుదిశలా వ్యాపింపచేసి.. ఘనకీర్తిని సొంతం చేసుకున్న తెలంగాణ వీరనారిగా నిలిచింది రాణి రుద్రమదేవి. కాకతీయ రాజవంశం నుంచి ఎంతోమంది రాజులు, రాణులు తమ కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించి, తమ రాజ్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అటువంటి సామ్రాజ్యం నుంచి వచ్చిన రుద్రమదేవి.. కాకతీయుల వంశంలో ఒక ధృవతారగా వెలిగింది. కాకతీయ వంశానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన ఆమె... దేశచరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించింది. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. నిజానికి ఈమె అసలు పేరు రుద్రాంబ! అయితే ఈమె తండ్రి గణపతిదేవుడికి పుత్రసంతానం కలగకపోవడం వల్ల ఆమెను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేశారు. అలా ఆ విధంగా ఆమె పేరు రుద్రమదేవిగా మారింది.
సామ్రాజ్య విశేషాలు :
కాకతీయవంశంలో అగ్రగణ్యుడిగా పేరొందిన గణపతిదేవుడు దాదాపు 62 సంవత్సరాలవరకు రాజ్యాన్ని పాలించిన అనంతరం... తన కూతురు రుద్రమదేవికి 1262లో ‘‘రుద్రమహారాజు’’ అనే బిరుదుతో కాకతీయ సింహాసనాన్ని అధిష్టించారు. అయితే ఆమె ఒక మహిళాపాలకురాలు కావడంవల్ల జీర్ణించుకోలేని అనేకమంది సామంతులు ఆనాడు తిరుగుబాటు చేశారు. ఒక మహిళకు సింహాసనాన్ని ఎలా అప్పగిస్తారంటూ నిరసనలు చేపట్టారు. అదే సమయంలో పాండ్యులు నెల్లూరు ప్రాంతాన్ని, గొంకరాజు మొదటి నరసింహుడు వేంగి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమ ప్రాంతాలను అధీనంలో తీసుకోవడం వల్ల పాకనాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరసింహుని కుమారుడు వీరభానుడు వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. అదే సమయంలో రుద్రమదేవి వారికి మద్దతుగా తన సేనాలతో కలిసి ఆ తిరుగుబాట్లన్నిటినీ విజయవంతంగా అణిచివేసింది.
రుద్రమదేవి ఎదుర్కొన్న దండయాత్రలన్నిటిలో దేవగిరి యాదవరాజుల దండయాత్ర అతి పెద్దది.. ఎంతో కీలకమైనది. ఆనాడు యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించాడు. అది తెలుసుకున్న రుద్రమదేవి ఆ యాదవలను ఓడించి.. దేవగిరి దుర్గం వరకూ తరిమి కొట్టింది. వేరేదారి లేని మహదేవుడు సంధికి దిగివచ్చి... యుద్ధ పరిహారంగా మూడుకోట్ల సువర్ణాలు చెల్లించాడు. రుద్రమ తానే స్వయంగా కాయస్త రాజ్యంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. Chandupatla (నల్గొండ) శాసనం ఆధారంగా కాయస్త అంబదేవునితో జరిగిన యుద్ధాలలోనే మరణిచినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈమెకు రాయగజకేసరి, ఘటోదృతి అని బిరుదులున్నాయి.
జీవిత నేపథ్యం :
గణపతిదేవుడు తన కుమర్తె రుద్రమదేవిని నిరవద్యపుర (నిడదవోలు) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె అయిన ముమ్మడమ్మ, మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాప రుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మను ఇందులూరి అన్నలదేవునికిచ్చి వివాహం చేసింది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more