చలన చిత్ర రంగంలో తమకంటూ సుస్థిరస్థానాన్ని ఏర్పరుచుకున్న సింగర్స్ లో అర్కాట్ పార్థసారధి కోమల ఒకరు. దక్షిణభారత దేశపు నేపథ్యగాయని అయిన ఈమె.. 1950, 60 దశకాల్లో తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో అనేక పాటలు పాడారు. మూడేళ్లప్రాయంలోనే పాటలు పాడటం ప్రారంభించిన ఈమె.. తన మధురకంఠంతో చిత్రపరిశ్రమను మైమరపించింది. కోకిలలాంటి వినసొంపైనా గాత్రం కలిగిన ఈమెను తమిళనాడు ప్రభుత్వం కళైమామణి బిరుదుతో సత్కరించింది.
జీవిత విశేషాలు :
1934 ఆగష్టు 28వ తేదీన మద్రాసులోని తిరువళ్ళికేనులో పార్థసారధి, లక్ష్మి దంపతులకు కోమల జన్మించారు. మూడేళ్ళ వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన కోమలకు ఒక తెలిసిన వ్యక్తి రేడియోలో పాడే అవకాశం కల్పించారు. అదే సమయంలో రేడియోలో నాదస్వరం వాయించటానికి రాజమండ్రి నుండి మద్రాసు వచ్చిన గాడవల్లి పైడిస్వామి ఆమె పాటను విని పరవశించిపోయారు. ఆమె గాత్రానికి ఫిదా అయిన ఆయన.. ఆమెను తనతో పాటు రాజమండ్రి తీసుకువెళ్ళి, అక్కడ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చారు. ఈమె తమిళురాలైనప్పటికీ తెలుగుదేశంలోనే సంగీతం నేర్చుకున్నారు.
శాస్త్రీయ సంగీతంలో పూర్తి శిక్షణ పొందిన అనంతరం కోమల తొలిసారిగా ఒరిస్సాలోని బరంపురంలో 1943లో జరిగిన శాస్త్రీయ సంగీత పోటీలో పాల్గొన్నారు. ఆ పోటీల్లో భాగంగా ముత్తుస్వామి దీక్షితార్ కృతి ‘శ్రీ గణనాయకం’ పాడి వెండి పతకం గెలుచుకున్నారు. సంగీత అవగాహన వుండటం వల్ల ఈమెకు 1944లో తొమ్మిదేళ్ళ వయసులోనే ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. అక్కడ పనిచేస్తుండగా.. సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. ప్రయాగ నరసింహశాస్తి సిఫార్సుతో 1946లో చిత్తూరు వి.నాగయ్య తీసిన ‘త్యాగయ్య’లో కోమల తొలిసారిగా సినిమా పాట పాడింది. ఆ తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.
ఆనాడు ఆనందభైరవి రాగంలో ‘మధురానగరిలో చల్లనమ్మ’ అనే పాటకు ఆమె 250 రూపాయల పారితోషికం అందుకున్నారు. కాలక్రమంలో ఈమె డిమాండ్ మరింత పెరిగిపోవడంతో పారితోషికం కూడా పెరుగుతూ వచ్చింది. అలాగే.. దక్షిణాది ఇండస్ట్రీ నుంచి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈమె సినిమాలలో పాడిన తొలిపాట, చివరి పాట తెలుగు పాటలే కావటం విశేషం. ఆలిండియా రేడియోలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కోమల 1995లో పదవీ విరమణ పొందింది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more