తెల్లదొరల చెరసాల నుంచి భారతీయుల్ని విముక్తి కల్పించడంలో చేసిన స్వాతంత్ర్య సమరపోరాటంలో మహిళలు సైతం తమవంతు కృషి చేశారు. దేశ స్వాంతంత్ర్యం మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారిలో చైతన్యం నింపారు. అలాంటి స్వాతంత్ర్యోద్యమ నాయకురాలలో అరుణా అసఫ్ అలీ ఒకరు. మహాత్మాగాంధీ ఆచరణలకు ప్రభావితురాలైన ఈమె.. స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్నారు. 1942లో గాంధీజీ జైలుకెళ్ళినపుడు ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళగా పేరుగాంచారు. ఆ ఉద్యమకాలంలో బొంబాయిలోని గవాలియా ట్యాంక్ మైదానంలో భారత జాతీయపతాకాన్ని ఎగురవేసిన మహిళగా ఈమె చిరస్మరణీయురాలు.
జీవిత విశేషాలు :
1909 జూలై 16వ తేదీన హర్యానాలోని కాల్కా ప్రాంతంలో ఒక బెంగాళీ బ్రహ్మసమాజ కుటుంబంలో అరుణా జన్మించింది. లాహోరు, నైనీతాల్ లలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈమె.. మహిళలకు అంతగా ప్రాధాన్యంలేని ఆనాటి కాలంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసి, సాటి మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఈమె కలకత్తాలోని గోఖలే స్మారక పాఠశాలలో బోధించింది. ఆ సమయంలో ఈమెకు భారత జాతీయ కాంగ్రేసు నాయకుడైన అసఫ్ అలీతో అలహాబాదులో పరిచయమేర్పడింది. ఈ పరిచయం పెళ్ళికి దారితీసింది. అయితే.. వీరిద్దరి మతాలు వేరవడంతోపాటు వయోబేధం (20 ఏళ్లు తేడా) ఎక్కువగా వుండటంతో అరుణ తల్లితండ్రులు పెళ్లికి నిరాకరించారు. అయినప్పటికీ వారిద్దరి 1928లో పెళ్లి చేసుకున్నారు.
స్వాతంత్ర్యోద్యమంలో అరుణ పాత్ర :
అసఫ్ అలీతో వివాహం చేసుకున్న తర్వాత భారత జాతీయ కాంగ్రేసులో క్రియాశీలక సభ్యురాలిగా అరుణ ఎన్నుకోబడింది. ఆనాడు ఉప్పు సత్యాగ్రహంలో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనల్లో ఈమె పాల్గొంది. అయితే.. ఆనాడు మహిళలకు సమాజంలో అంత ప్రాధాన్యం లేనిపక్షంలో ఈమెను దేశదిమ్మరి అనే అభియోగం మోపి అరెస్టు చేశారు. అందుకే.. రాజకీయ ఖైదీలందరి విడుదలకు తోడ్పడిన గాంధీ-ఇర్వింగ్ ఒప్పందముతో 1931లో ఈమెను విడుదల చేయలేదు.
కానీ.. ఆమెను కూడా విడుదల చేయాలని, లేకపోతే జైలును వదిలివెళ్లేది లేదని ఖైదులో వున్న ఇతర మహిళా పట్టుబట్టారు. అప్పుడు మహాత్మా గాంధీ కలుగజేసుకోవటంతో వారు తమ పట్టును సడలించలేదు. ఆ తరువాత ప్రజాఆందోళన వలన అరుణను విడుదల చేశారు. 1932లో తీహార్ జైళ్ళో రాజకీయ ఖైదీగా వున్న సమయంలో.. జైల్లో వున్న రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా అరుణ నిరాహారదీక్ష నిర్వహించింది. ఈమె ప్రయత్నం ఫలితంగా తీహర్ జైళ్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగైంది. కానీ ఈమెను మాత్రం అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదులో ఉంచారు. జైలునుండి విడుదలైన తర్వాత ఈమె రాజకీయాల్లో తిరిగి పాల్గొనలేదు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈమె ఢిల్లీ నగరానికి మెట్టమొదటి మేయర్ గా నియమించబడ్డారు. స్వాతంత్ర్యోద్యమంలో ఈమె చేసిన సేవలకుగాను ‘భారతరత్న’ అవార్డు లభించింది. ఈమె 1996 జూలై 29న మరణించింది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more