ప్రైవేట్ బ్యాంకులకు తీసిపోకుండా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ) ఇటీవల తీసుకొచ్చిన పలు నిబంధనలపై ఖాతాదారులు ఆగ్రహాంతో ఊగిపోతున్నారు. అవసరమైతే అకౌంట్లు మూసేస్తామే తప్ప వారు పెట్టే అడ్డమైన నిబంధనలను పాటించమని చెప్పేస్తున్నారు. అదలా ఉండగానే బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బ తీసేలా వచ్చే నెలలో నిరసనలకు సిద్ధమౌతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇదే అంశంపై పార్లమెంట్ లో ప్రతిపక్షాలు గళం వినిపించాయి.
రాజ్యసభలో సోమవారం మధ్యాహ్నాం వాడి వేడి చర్చ జరిగింది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో కనీసం రూ.5 వేల బ్యాలెన్స్ ఉంచాలన్న బ్యాంకు నిబంధనపై విపక్ష సభ్యులు గళం ఎత్తారు. కొత్త నిబంధనలన్నింటినీ తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. తొలుత సీపీఐ సభ్యుడు కేకే రాజేశ్ ఈ అంశంపై మాట్లాడుతూ మినిమం బ్యాలెన్స్ లేకుంటే జరిమానా విధిస్తామని ఓ ప్రభుత్వ బ్యాంకు ఇలా చెప్పటం దారుణమని మండిపడ్డాడు. ఆ నిబంధన వల్ల దాదాపు 31 కోట్ల మంది ఖాతాదారులు ఇబ్బందిపడతారని ఆయన అంటున్నాడు.
ప్రభుత్వం చెప్పిందనే బ్యాంకు ఖాతాలు తెరిచి, నగదు రహిత లావాదేవీలు చేస్తోన్న పేద, మధ్య తరగతి ప్రజలకే ఇది సంకటమని వారంటున్నారు. ఒకేసారి 500 నుంచి 5000 లకు పెంచటమేంటని ప్రశ్నించాడు. కార్పొరేట్ శక్తులను ఏం చేయలేని బ్యాంకులు, లోన్లు తీసుకునే రైతులను టార్గెట్ చేయటం శోచనీయమన్న కాంగ్రెస్ తక్షణమే ఆ నిబంధనలను తొలగించాలని కోరుతూ నినాదాలు చేస్తూ పెద్ద రచ్చే చేసింది. కాగా, వచ్చే నెల 1 నుంచి(ఏప్రిల్ 1) ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే భారీగా బాదేందుకు సిద్ధమౌతున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more