ఊహించని గెలుపు, ఆపై ఉత్తరప్రదేశ్ 21వ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఇలా ప్రకటించి అలా బాధ్యతలు అప్పజెప్పిందో లేదో రాజకీయ ప్రత్యర్థులు తమ నోటికి పని చెప్పటం ప్రారంభించారు. మరికొందరు మాత్రం ఈ విషయంలో నోరు మెదపకపోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అఖిలేష్ బాబాయి, సమాజ్ వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ మాత్రం కాస్త భిన్నంగా వ్యాఖ్యలు చేశారు.
యోగి పని తీరుపై అప్పుడే విమర్శలు గుప్పించడం సబబు కాదని, ఆరు నెలల తర్వాత విమర్శలు గానీ, సమీక్షలు గానీ చేయాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తగినంత సమయం ఇస్తేనే కదా యోగి పని తీరు తెలిసేది అంటూ వ్యాఖ్యానించాడు. కాగా, గోరఖ్ పూర్ నుంచి ఏడుగురు పురోహితులను రప్పించి తన అధికారిక నివాసంలో యోగి పూజలు నిర్వహించారు. దీనిపై వస్తున్న విమర్శలను రాంగోపాల్ యాదవ్ కొట్టి పారేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించడం సాధారణమేనంటూ వ్యాఖ్యానించాడు.
ములాయం నుంచి అధ్యక్ష పదవిని లాక్కోవటంలో అఖిలేష్ కు రాజ్యసభ సభ్యుడైన రాంగోపాల్ యాదవ్ సాయం చేశాడనే టాక్ ఉంది. అంతేకాదు కాంగ్రెస్ తో పొత్తు పట్ల నేతాజీ ఇష్టం లేకపోయినా రాంగోపాల్ మూలంగానే అఖిలేష్ ముందుకు సాగి దారుణ ఓటమి చవిచూశాడన్న పార్టీ అంతర్గత విమర్శలు కూడా ఈ మధ్య వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో కొడుకు, తమ్ముళ్లనే బాధ్యులను చేయటం సరికాదన్న ములాయం ఓటమికి అందరూ బాధ్యులే అని ప్రకటించటం కొసమెరుపు.
యోగిపై మోదీ కన్ను...
ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ డేగ కన్ను వేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రముఖ జాతీయ దిన పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. యూపీ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్రాను యోగి ఆఫీస్ లో నియమించినట్టు తెలుస్తోంది.
పీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన మిశ్రా సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మోదీకి మధ్య సంధాన కర్తగా వ్యవహరించబోతున్నాడని ఆ కథనం పేర్కొంది. దీనిని ధృవీకరిస్తూ.. యోగితో మిశ్రా 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు కూడా. నిత్యం యోగితో టచ్ లో ఉంటూ, యూపీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more