వివాదాస్పద ఆద్యాత్మిక గురువు ఆశారాం బాపు కేసులో అదృశ్యమైన మహిళ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఆసారాం బాబు అరెస్టు కేసులో కీలక సాక్షిగా మారిన ఈ వివాహిత అదృశ్యం కావడంతో పోలీసులే ఖంగుతిన్నారు. సుమారు రెండు వారాలుగా వివాహిత మహిళ ఆదృశ్యం కావడంపై పలు కథనాలు, అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహిళ సూరత్ లోని కామ్ రాజ్ పోలిస్ స్టేషన్ కు చేరుకుంది. అక్కడి పోలీసులతో పలు విషయాలపై అదృశ్య చర్చించినట్లు సూరత్ జిల్లా పోలీసు సూపరింటెండ్ ప్రదీప్ సిజుల్ తెలిపారు.
అసారాం బాపు అరెస్టు తరువాత మహిళ అహ్మదాబాద్ లోని సూరత్ నివాసం నుంచి రెండు వారాల కింద్రట అదృశ్యమై.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చేరుకుంది. అయితే అశారం కేసులో ప్రధాన పిర్యాదుదారుగా వుండటం చేత ఆమెకు పోలీసులు రక్షణ కల్పించారు. పోలీసు రక్షణ తన సామాజిక జీవనానికి ప్రతిబంధకంగా మారిందని అమె పేర్కొంది. తన స్నేహితులు, తెలిసిన వాళ్లు అందరూ తనకు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారని అడుగటం, తనను ఇబ్బంది పెట్టిలా పరిణమించిందని తెలిపారు. తన పిల్లలు కూడా పాఠశాలలో ఇదే విషయమై పలు ప్రశ్నలను ఎదుర్కోన్నారని పేర్కొన్నారు.
దీంతోనే తాము బంధువుల కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పి ఈ నెల 14న ఇండోర్ కు వెళ్లామని చెప్పారు. ఈ కారణంగానే తమ నివాసాన్ని మార్చాల్సి వచ్చిందని, తాము మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు వెళ్లామని తెలిపారు. అయితే ఈ నెల 18 వారు అదృశ్యమైనట్లు, బాధితురాలి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. కాగా, అశారాం బాపు కేసులో తాను మొదట ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేందుకు వివాహిత మహిళ పెట్టనుకున్న పిటీషన్ ను న్యాయస్థానం ఈ నెల 22న తిరస్కరించింది.
అశారాం బాపు కేసులో ప్రధాన పిర్యాదుదారుగా వున్న మహిళ అంతకు ముందు తమపై ఆశారాం బాబు పలు సార్లు లైంగికంగా వేధించాడని పిర్యాదుచేశారు. తాను ఆశారాం బాపు ఆశ్రమంలో వున్న సమయంలో 1997 నుంచి 2006 వరకు అనేక పర్యాయాలు ఆశారాం బాపు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపారు. అదే సమయంలో అమె చెల్లి కూడా ఆశారాంబాపు కుమారుడు నారాయణ సాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో కదిలిన పోలీసులు తండ్రి కోడుకులను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more