"కరణం మల్లేశ్వరి" తెలుగు వారు గర్వించదగిన వ్యక్తి. శ్రీకాకుళంకు చెందిన ఈమె బరువులు ఎత్తడం ఆటలో ఒలింపిక్ పతకం సాధించి ప్రసిద్ధురాలయ్యింది. ఈమె 1975 జూన్ 1 న జన్మించింది. చిత్తూరు జిల్లా తవణంపల్లి గ్ర్రామములో పుట్టిన మాల్లీశ్వరి తండ్రి ఉద్యోగరీత్యా ఆమదాలవలకు వచ్చారు , ఇక్కడే సెటిల్ అయ్యారు .. మల్లీశ్వరి అక్క నరసమ్మకు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ మాజీ కోచ్ నీలంశెట్టి అప్పన్న శిక్షణ ఇచ్చేవారు.
అక్క విజయాలను చూచిన మల్లీశ్వరి కూడా ఈ రంగం పై ఆసక్తి పెంచుకున్నారు . చివరకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు . చైనా దేశం లొని గ్యాంగ్ ఝూ లో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోతీల్లో 54 కిలోల విభాగం లో దేశానికి మూడు స్వర్ణపతకాలు తెచ్చరు . ఆ తరువాత టర్కీ రాజధాని ఇస్తాంహుల్ లో జరిగిన పోటేల్లో తన ప్రత్యర్ధి చైనా క్రీడాకారిణి డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువుకావడం తో ఆ టైటిల్ ను మల్లీశ్వరికి ప్రధానము చేసారు . 1995 చైనాలో జరిగిన పోతీల్లో వరుసగా 105,110, 113, కిలోల బరువులు ఎత్తి చైనా వెయిట్ లిఫ్టర్ - లాంగ్ యాపింగ్ పేరున ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొటారు.
సిడ్నీలో జరిగిన 2000 ఒలింపిక్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించింది. ఆ విధంగా ఒలింపిక్ ఆటలలో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది, మరియు మూడవ భారతీయ వ్యక్తి. (అంతకుముందు పతకాలు సాధించిన భారతీయులు - 1952 హెల్సింకీ లో ఖషబా జాదవ్, మరియు 1996 అట్లాంటాలో టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్)
పతకాలు, పురస్కారాలు
2000 - ఒలింపిక్ క్రీడలు - కాంస్య పతకం - 69 కిలోగ్రాముల విభాగంలో
1994 - ఇస్తాంబుల్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు - బంగారు పతకం
1995 - పూసాన్, కొరియా - ఆసియా ఛాంపియన్షిప్ పోటీలు
1995 - ఘుంగ్జౌ, చైనా - 54 కిలోల విభాగంలో మూడు బంగారు పతకాలు
భారత ప్రభుత్వం అర్జున అవార్డు
1995 - రాజీవ్ గాంధీ ఖేల్ రత్న బహుమతి
1999- పద్మశ్రీ పురస్కారం
ఒకానొక సందర్భంలో ఆమె అన్న సంచలన వ్యాఖ్యలను కొందరు క్రీడాకారులు ఇప్పటికి గుర్తు చేసుకుంటారు..... భారత దేశానికి పతకాలు ఎందుకు రావని ఎప్పుడూ అడుగుతుంటారని.., అది ఎయిర్-కండిషన్డ్ గదులలో కూర్చుని మాట్లాడినంత సులభం కాదని ఆ ప్రయత్నంలో ఉన్న శ్రమ, వేదన ఒక క్రీడాకారులకే తెలుస్తాయని వ్యాఖ్యలు చేశారు.
హరికాంత్
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more