ప్రస్తుత సమాజంలో అన్నిరంగాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ప్రతిభను కలిగి వుంటారని ‘‘వందన శివ’’ను నిదర్శనంగా తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే.. ఈమె ఒక ఒక తత్త్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ, స్త్రీవాద రచయిత్రి... ఇలా అన్నింటిలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. ఎన్నో భారతదేశపు సంప్రదాయక ఆచారాల వివేకతను సమర్థించిన మహిళ!
జీవిత చరిత్ర :
1952 నవంబర్ 5వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో వందన జన్మించింది. ఈమె నైనిటాల్లోని సెయింట్ మేరీ స్కూల్ నందు, డెహ్రాడూన్లోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ నందు విద్యను అభ్యసించింది. భౌతికశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందిన తరువాత ‘‘చేంజెస్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ పీరియాడిసిటీ ఆఫ్ లైట్’’ అనే పరిశోధనా వ్యాసంతో (అంటారియో, కెనడా) గ్వెల్ఫ్ విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో ఎం.ఏ. పూర్తి చేసింది. 1979లో ఆమె తన పి.హెచ్.డి పూర్తి చేసి, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియో నుండి పట్టా పొందింది. ఆ సమయంలో ఆమె పరిశోధన అంశము ‘‘హిడెన్ వేరియబుల్స్ అండ్ లోకాలిటి ఇన్ క్వాంటం థియరీ’’. తరువాత ఆమె బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ ల నందు విజ్ఞాన, సాంకేతికశాస్త్రాలతోపాటు పర్యావరణ పాలసీలపై బహుళశాస్త్ర పరిశోధనకు వెళ్ళింది.
వృత్తి జీవితం
వ్యవసాయము, ఆహార లక్షణాలు అలవాటులలో మార్పు కోసం వందన శివ తనవంతు పోరాడింది. మేధో సంపత్తి హక్కులు, జీవ వైవిధ్యము, జీవ సాంకేతిక విజ్ఞానము, జీవ నీతి, జన్యు ఇంజినీరింగ్ మొదలైన క్షేత్రాలలో శివ మేధో సంపత్తితో ప్రచారోద్యమాల ద్వారా పాల్గొంది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియాలలో హరిత ఉద్యమాలలో జన్యు ఇంజనీరింగ్ కి వ్యతిరేక ప్రచారాల కోసం మౌలిక సంఘాలకు తన సహాయాన్ని అందించింది. 1982లో నవ్దన్య ఏర్పాటుకు దారితీసిన వైజ్ఞానిక, సాంకేతిక మరియు జీవావరణ శాస్త్రాల పరిశోధనా సంస్థను ఆమె స్థాపించింది. మూడవ ప్రపంచపు మహిళల సామర్ధ్యాలను పునర్నిర్వచించటానికి ఆమె వ్రాసిన పుస్తకం ‘‘స్టేయింగ్ అలైవ్’’ దోహదపడింది.
పర్యావరణస్త్రీవాదం
పర్యావరణస్త్రీవాద ఉద్యమమునందు వందన శివ ముఖ్య పాత్రను పోషించింది. ఆమె వ్రాసిన వ్యాసము ఎంపవరింగ్ ఉమెన్ ప్రకారం ఆమె సలహా ఇస్తూ, వ్యవసాయరంగంలో భరించదగిన నిర్మాణాత్మక సామీప్యతను శ్రామిక మహిళల చుట్టూ ఎక్కువగా కేంద్రీకృతమై ఉండే వ్యవసాయ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టుట ద్వారా సాధించవచ్చునని తెల్పింది. స్త్రీల ‘‘బహిష్కరణపై పూర్వకాల తర్క’’ ప్రాబల్యానికి వ్యతిరేకంగా వాదిస్తూ, స్త్రీలు ప్రధాన కేంద్రముగా కలిగిన పధ్ధతి ప్రస్తుత వ్యవస్థను పూర్తి ప్రయోజనకర రీతిలో మార్చుతుంది అని ప్రతిపాదించింది. ఈ విధంగా వ్యవసాయ పద్ధతులలో మహిళలను సమ్మిళితం చేసి సాధికారిత కేంద్రీకృతం ద్వారా భారత, ప్రపంచ ఆహార భద్రతకు ప్రయోజనం చేకూరుతుంది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more