పౌరాణిక గాథలోని మహాసాధ్వీమణి సీత పాత్రకు ప్రాణం పోసిన నటి అంజలీదేవి ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో 1927 ఆగస్టు 24న జన్మించారు. లవకుశ, సువర్ణ సుందరి, అనార్కరి తదితర సినిమాలు అంజలీదేవికి ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. సినిమాల్లోకి రాకముందు ఆమె అనేక రంగస్థల నాటకాల్లో నటించారు. హీరోయిన్ గా ఆమె నటించిన తొలిచిత్రం కష్టజీవి. దీనికి 1940లో ఎల్ వి ప్రసాద్ రూపొందించారు. . ఈ సినిమా చేస్తుండగానే దర్శకుడు సి పుల్లయ్య ఆమెకు తన సినిమా గొల్లభామలో మోహిని పాత్రను ఇచ్చారు. ఆమె తన నటనా చాతుర్యంతో ఎందరెందరి ప్రసంశలు అందుకోవడంతో పాటు అనతి కాలంలోనే ప్రముఖ నటీమణిగా వెలుగొందారు.
సుమారు 350 తెలుగు సినిమాలు, మరికొన్ని తమిళ , కన్నడ చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన లవకుశ ఎంతో పేరప్రఖ్యాతులు తేవడమే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. 1963లో విడుదలైన ఈ చిత్రం తెలుగు చిత్ర సీమలో మరపురాని సినిమాగా నిలిచిపోయింది. అంజలీ దేవి హీరోయిన్ గా, దేవత, వదిన, తల్లి తదితర పాత్రలలో నటించి జీవం పోశారు. దీనికి తోడు నిర్మాతగానూ పలు సినిమాలను నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు తో అనార్కలి సినిమా రూపొందించి దీనిలో హీరోయిన్ గా తానే నటించారు.
చెన్నయ్ లో స్థిరపడిన అంజలీదేవికి ఇద్దరు కుమారులు. వారు అంజలి పిక్చర్స్ పేరిట తెలుగులో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక అంజలీ దేవి అందుకున్న అవార్డుల విషయానికొస్తే 1956లో తెలుగు విభాగంలో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అనార్కరి చిత్రానికి గాను అందుకున్నారు. అలాగే 1957లో సువర్ణ సుందరి చిత్రంలో నటనకు మరోమారు ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు.
అలాగే 1958లో చెంచులక్ష్మి, 1959లో జయభేరి చిత్రాలకు గాను అవార్డులు దక్కించు కున్నారు. గుంటూరులోని నాగార్జునా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో అంజలీ దేవిని సత్కరించింది. 1994లో రఘుపతి వెంకయ్య అవార్డును, 2006లో రామినేని అవార్డును అందుకున్నారు. అదేవిధంగా 2008లో ఎ ఎన్ఆర్ నేషనల్ అవార్డును దక్కించుకున్నారు. 86 సంవత్సరాల వయసులో 2014 జనవరి 13న అంజలీ దేవి అనారోగ్యంతో భాధపడుతూ చెన్నయ్ లోని విజయ ఆసుపత్రిలో కన్ను మూశారు. నేత్రదానం చేసి పలువురికి ఆదర్శ ప్రాయంగా నిలిచారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more