రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వెళితే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలో రచ్చబండ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడారు. అధిష్టానం ఓట్లు, సీట్లు కోసమే రాష్ట్ర విభజనకు పూనుకున్నదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయన్నారు. కాంగ్రెస్కు దేశంలో అనేక రాష్ట్రాల్లో సీట్లు బాగా తగ్గిపోయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో సాధించిన సీట్లు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయన్నారు.
కొందరు ఢిల్లీ పెద్దల కన్ను ఆంధ్రపై పడిందని.. అందుకే రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి పూనుకున్నారని విమర్శించారు. అయితే కేంద్రం తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తుందనే నమ్మకముందన్నారు. వెస్టిండీస్-ఇండియా మ్యాచ్ను తాము అడ్డుకుంటామని వస్తున్న కథనాలను ఖండించారు. భీమిలి పోర్టు పనులు త్వరలో ప్రాంరంభమవుతాయని చెప్పారు. ప్రాజెక్టు రిపోర్టు కోసం కన్సెల్టెన్సీకి అప్పగించామన్నారు.
ఐజి లక్ష్మినారాయణ రాక
మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్, మహా రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ వి.వి.లక్ష్మినారాయణ ఈ నెల 14న నగరానికి రానున్నారు. 13వ తేదీ రాత్రి ఆయన విశాఖ చరుకుంటారు. శ్రీవెంకటేశ్వర సేవ సమితి, శ్రీ శైలం ప్రాజెక్టు స్కూలు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నరవ జిల్లా పరిషత్ స్కూలులోజరిగే విద్యార్ధుల సమావేశంలో ముఖ్య అతిధిగా ల క్ష్మినారాయణ పాల్గొంటారు.
ఈ సమావేశానికి మరో అతిధిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు డైరక్టర్ పి.మధుసూదన్ కూడా పాల్గొననున్నారు. రెండు వేల మంది విద్యార్ధులు హాజరయ్యే ఈ సమావేశంలో లక్షి మనారాయణ ముఖ్య ప్రసంగం చేస్తారని శ్రీశైలం ప్రాజెక్టు స్కూలు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య తెలియజేశారు. విద్యార్ధులకు వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, వారి పురోభివృద్ధికి స్పూర్తిని ఇచ్చే సందేశాన్ని ఇస్తారని ఆయన తెలియజేశారు. నరవ జిల్లా పరిషత్ స్కూలుతో పాటు చూట్టు పక్కల ప్రాంతాల విద్యార్ధులు పాల్గొంటారని వివరించారు. జిల్లా పరిషత్ స్కూలులో ఎనిమిది తరగతులతో పాటు మౌళిక సదుపాయల కల్పనకు శ్రీవెంకటేశ్వర సేవ సమీతి రూ.60 లక్షల ఖర్చు చేసి నిర్మాణం చేపట్టిందని తెలియజేశారు. ఈ సమావేశానికి ప్రజలందరు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more