Ap telugu political tdp leaders fire on dadi veerabhadra rao

tdp leaders fire on dadi veerabhadra rao, dadi veerabhadra rao to join ysrcp, dadi veerabhadra rao in visakhapatnam, tdp leader dadi veerabhadra rao, dadi ratnaka, ys jagan-ysr, ys jagan, ysrcp, chandrababu naidu, tdp leaders,

tdp leaders fire on dadi veerabhadra rao

దాడి తీరుపై పార్టీ వర్గాల ఆగ్రహం

Posted: 05/03/2013 06:45 PM IST
Ap telugu political tdp leaders fire on dadi veerabhadra rao

 

 

 

పార్టీలో కీలక పదవులు ఇవ్వనున్నట్టు తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినా పదవీ కాంక్షతో పార్టీని వీడడం నమ్మక ద్రోహంగా అభివర్ణిస్తున్నాయి. గతంలో పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి గెంతిన వారు గతిలేక తిరిగి పార్టీ గూటికి చేరినా అక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం ఒక్కటేనని తెలియచేస్తున్నాయి. ఏ ఒక్కరో పార్టీని వీడితే పెద్దగా నష్టం ఉండదని, రానున్న 2014 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నాయి.తెలుగుదేశం పార్టీ తనకు మరోమారు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదన్న కారణంగా రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడవడం దాడి వీరభద్రరావు కే చెల్లిందని తెలుగుదేశం పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో మూడు దశాబ్దాల పాటు అత్యున్నత హోదాలు కల్పించి, ఈ పర్యాయం వేరోకరికి అవకాశం కల్పించడాన్ని జీర్ణించుకోలేని దాడి ది కేవలం అవకాశ వాదమని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

అన్ని వేళలా ఒకరికే పదవులు ఇవ్వాలంటే సాధ్యపడదని, ఉత్తరాంధ్రా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి దాడి కంటే ఎనలేని సేవలు చేసిన వారున్నారని, వారు ఏనాడూ పదవులు ఆశించి పనిచేయలేదని, దశాబ్దాల తరబడి పార్టీ జెండాలు మోసిన వారిలో వేలాది మందికి ఏనాడూ ఒక్క పదవి కూడా లభించలేదని తెలియచేసాయి. పార్టీ అధికారం లో లేనప్పటికీ దాడికి అధికార హోదాలోని ప్రభుత్వ పదవులు వరించాయని, మూడు దశాబ్దాల కాలంలో పదవులు లేకుండా ఏనాడు దాడి ఖాళీగా లేరన్న విషయాన్ని తెలియచేసాయి.

దాడి జిల్లాలో కంటే హైదరాబాద్‌ లోనే ఎక్కువ కాలం ఉన్నారని, వీరి సేవలు జిల్లా కార్యకర్తలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయో దాడి వివరించాల్సిన అవసరం ఉందని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే దాడి కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులను కలవడం జరిగిందని, దీనికి నిదర్శనమే వస్తున్నా మీకోసం పాదయాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతుండగా, దాడి రాష్ట్ర ఓడరేవుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావును కలవడమేనని తెలిపాయి. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతారన్న వార్తలూ వినిపిస్తున్నాయని తెలియచేస్తున్నాయి. ఏ పార్టీ కూడా దాడికి ప్రాధాన్యత కల్గిన పదవులు ఇవ్వదని తెలిపాయి.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more