అధిష్టానం నమ్మితే పార్టీ కోసం ప్రాణాలైనా ఇస్తామని, నమ్మకం లేకపోతే ఏమీ చేయలేమని దాడి వివరించారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగానే శాసనమండలిలో వ్యవహరించానని, తన కుమారుడు చంద్రబాబు వెంట పాదయాత్రలో నడిచారని, ఆయనను పట్టించుకోలేదని దాడి వీరభద్రరావు ఆరోపించారు. తాము ఏ తప్పు చేశామని ఆయన ప్రశ్నించారు. గత కొద్ది కాలంగా పార్టీకి దూరంగా ఉన్న టీడీపీ నేత దాడి వీరభద్రరావు మీడియా ముందుకు వచ్చారు. తనను పాదయాత్రలో దూరంగా పెట్టారని, తనను చూస్తేనే అసహ్యించుకుంటున్నారని తెలిసి దూరంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. 30 ఏళ్లుగా పనిచేసిన పార్టీని వీడుతుంటే కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకున్నారని దాడి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని వీడే నిర్ణయం తీసుకున్నందకు తనకు బాధగా ఉందని ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని, ఏకనాయకత్వానికి అలవాటు పడ్డామని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. తనను పలు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని ఆయన తెలిపారు. యాంటీ కాంగ్రెస్ పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. రేపు చంచల్గూడ జైల్లో ఉన్న జగన్ను ములాఖత్ సమయంలో భేటీ అవుతున్నట్లు దాడి చెప్పారు. తమకు ఏవిధంగా ప్రాధాన్యత ఇస్తారో, పార్టీ విధి విధానాలపై చర్చించనున్నట్లు తెలిపారు. జగన్ సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని, జగన్ జవాబులు సంతృప్తినివ్వకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని దాడి ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more