ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. మూడు జిల్లాల్లో 92.38 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ బాక్సులను ఓట్ల లెక్కింపు కేంద్రంమైన విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియానికి తరలిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ్రస్టాంగ్ రూములో వీటిని భద్రపరుస్తారు. 25వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నది.ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం ఎన్నికలు నిర్వహించగా, మూడు జిల్లాల్లో 92.38 శాతం పోలింగ్ నమోదైంది. 14,428 మంది ఓటర్లకుగాను 13,237 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు సమాచారం.
విశాఖ జిల్లాలో 6,094 మందికి 5,338 మంది(88 శాతం), విజయనగరంలో 3,723 మందికి 3,513 మంది(94 శాతం), శ్రీకాకుళం జిల్లాలో 4,612 మందికి 4,338 మంది(92 శాతం) ఓట్లు వేశారు. ఉదయం ఎనిమిది గంటలకే పలు పోలింగ్ కేంద్రాలకు వద్ద ఉపాధ్యాయులు వచ్చారు. ఉదయం పది గంటలకు విశాఖలో 23, విజయనగరంలో 30, శ్రీకాకుళంలో 27 శాతం, మధ్యాహ్నం 12 గంటలకు విశాఖలో 62, విజయనగరంలో 68, శ్రీకాకుళంలో 71 శాతం,రెండు గంటలకు విశాఖలో 82, విజయనగరంలో 87, శ్రీకాకుళంలో 86 శాతం, నాలుగు గంటలకు విశాఖలో 88, విజయనగరంలో 94, శ్రీకాకుళంలో 92 శాతం పోలింగ్ జరిగినట్టు అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more