మొత్తానికి అరకు ఉత్సవ్కు తేదీలు ఖరారయ్యాయి. రెండు రోజులపాటు సాగనున్న ఈ ఉత్సవాలు 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉత్సవ్ షెడ్యూల్ను జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి విడుదల చేశారు. 20వ తేదీ ఉదయం కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి కిశోర్చంద్రదేవ్, రాష్ట్ర మంత్రులు పి.బాలరాజు, గంటా శ్రీనివాసరావు, అరకు ఎమ్మెల్యే సీవేరి సోమ ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు ఫొటో ఎగ్జిబిషన్, బోటుషికారును ప్రారంభిస్తారని, గిరిజన సంప్రదాయ థింసానృత్యాలు, వాలీబాల్ పోటీలు ఉంటాయన్నారు.
21వ తేదీన ఖోఖో, విలువిద్య, రంగోలీ పోటీలుంటాయని ఇందులో పాల్గొనగోరే వారు గిరిజన మ్యూజియం ఇన్చార్జి మురళి(సెల్: 9440803588)ని సంప్రదించాలని సూచించారు. 21వ తేదీ సాయంత్రం జరిగే ముగింపు ఉత్సవాలకు కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు, పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, పలువురు పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు పాల్గొంటారని వివరించారు.
కాగా, అరకుఉత్సవ్ అనుకున్నప్పటినుంచి అవాంతరాలు మొదలయ్యాయి. పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగులు అనుకోని రీతిలో సమ్మెకు దిగడంతో తొలుత ప్రకటించినట్టు 15వ తేదీన ఉత్సవ్ ప్రారంభానికి ఆటంకం ఏర్పడింది. పర్యాటకశాఖ సీఎండీ చందనాఖాన్ వచ్చి చర్చలు జరపడంతో తొలుత అరకులోని సిబ్బంది సమ్మె విరమించినా, బొర్రాలోని సిబ్బంది పట్టువీడలేదు. వీరికితోడు అరకులోని పద్మాపురం గార్డెన్స్, మ్యూజియంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మెకు దిగడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. ఎట్టకేలకు బొర్రాలోని సిబ్బంది గురువారం సమ్మె విరమించినా ఐటీడీఏ పరిధిలోని సిబ్బంది మాత్రం కొనసాగిస్తున్నారు. తొలుత ఉత్సవ్ను ఏడు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించినా అనుకోని అవాంతరాలవల్ల మళ్లీ 19నుంచి మూడు రోజులపాటు జరపాలని అధికారులు భావించారు. అయితే అందుకు తగ్గ ఏర్పాట్లు జరగకపోవడంతో... ఉత్సవ్ను కొన్నాళ్లపాటు వాయిదా వేయలేక కేవలం రెండు రోజులకే పరిమితం చేశారు. ఏదైతేనేం ఎలాగోలా ఉత్సవాలు నిర్వహించాలని భావించడంతో వాటికి సంబంధించిన పనులు చకచకా చేపడుతున్నారు. మ్యూజియంలోని కళాగ్రామంలో నిర్మించిన గిరిజన బజార్, స్టాల్స్ రంగులతో మస్తాబౌతున్నాయి. బజార్లోని సీసీ రోడ్లు చకచకా చేపడుతున్నారు. అయితే ఐటీడీఏ కార్మికులు పనిచేసే మ్యూజియం, పద్మావతి గార్డెన్లలో ఎటువంటి పనులు చేపట్టడంలేదు. మరి వాటి సందర్శనకు వచ్చేవారికోసం తాత్కాలిక ఏర్పాట్లైనా చేస్తారేమో చూడాలి.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more