తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశంలో ఉమా మాట్లాడుతూ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉందని విమర్శించారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేవిధంగా ఉండేలా చేయటానికి ప్రధానమంత్రిపై కేంద్ర మంత్రులు ఒత్తిడి తీసుకు రావాలని దేవినేని ఉమా అన్నా కోరారు.
వైఎస్ హయాంలో మిగులు జలాలపై కేంద్రానికి రాసిన లేఖ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.కృష్ణా జలాలు, మిగులు జలాలపై వైఎస్కు అవగాహన లేకపోవటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. డెల్టాలో ఒక పంటకు కూడా నీరు రాని పరిస్థితి ఏర్పడుతోందని, నాగార్జున సాగర్ నుంచి నీరు రాని పరిస్థితి ఏర్పడబోతోందని చెప్పారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఏ విధంగా నీళ్ళొస్తాయో కేసీఆర్కు కించిత్తు అవగాహన కూడా లేదని విమర్శించారు.
రాష్ట్రానికి దక్కాల్సిన నికర జలాలను కర్నాటక, మహారాష్ట్రలు దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పట్ల కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ రైతులకు ఎప్పుడూ అండగా నిలుస్తుందని చెప్పారు. సీమాంధ్ర మంత్రులు, కేంద్ర మంత్రులు ఢిల్లీ చుట్టూ, జైరాం రమేష్ చుట్టూ చక్కెర్లు కొడుతున్నారని, మూడు నెలల్లో ఊడిపోయే పదవుల కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. సోనియాకు జైపాల్ రెడ్డి ఊడిగం చేస్తూ రాష్ట్ర విభజనకు పూనుకుంటున్నాడని విమర్శించారు. నికర జలాలను దోపిడీ చేస్తున్న షిండే సీమాంధ్రకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more