ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు తన పంతం నెగ్గించుకున్నారు. కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. సహాయ మంత్రి చేయకుండానే ఏకంగాక్యాబినెట్ మంత్రి పదవి పొందారు.అయితే కావూరి మంత్రి పదవితో తెలంగాణలో కొత్త చిచ్చు రగిలింది. కావూరి మంత్రి పదవితో సీమాంధ్రల మంత్రుల సంఖ్య 9కి చేరుకుంది తెలంగాణాలో మాత్రం ముగ్గురే ఉండటం పై తెలంగాణ వాదులు మండిపడుతన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం క్యాబినేట్ మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డితో పాటు సీమాంధ్ర కావూరి కూడా క్యాబినేట్ మంత్రిగా నియమితులయ్యారు. క్యాబినెట్ మంత్రి హోదాలో జౌళిశాఖను పొందారు. గత మంత్రివర్గ విస్తరణలో కావూరికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అల్కపాన్పు పూనారు. అలాగే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయాక విభాగం సిడబ్ల్యూసీలో శాశ్వత ఆహ్వానితుడిగా అవకాశం లభించింది. మరో వైపు కావూరుని క్యాబినెట్ మంత్రిగా నియమించటం, గుంటూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు జెడి శీలం ఆర్ధిక శాఖ సహాయమంత్రిగా నియమితులుకావడంతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మొత్తం 13 జిల్లాలకు గాను 9మంది కేంద్రమంత్రులు ప్రాతినిధ్యం వహించడం ఇదే ప్రథమమం. శ్రీకాకుళం నుంచి కిల్లి కృపారాణి, విజయనగరం నుంచి కిషోర్ చంద్రదేవ్, విశాఖపట్నం నుంచి డి.పురంధేశ్వరి, తూర్పుగోదావరి నుంచి పల్లం రాజు, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లా నుంచి కావూరి సాంబశివరావు, గుంటూరు జిల్లా నుంచి జెడి శీలం, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల ఎంపి పనబాక లక్ష్మీ, చిత్తూరు నుంచి కె.చిరంజీవి, కర్నూలు నుంచి కె.సూర్యప్రకాష్ రెడ్డి కేంద్రమంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణాలో కేవలం ముగ్గురు మాత్రమే కేంద్ర మంత్రులుండగా సీమాంధ్ర నుంచి 9మంది కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహించడం రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more