మెగా లోక్ అదాలత్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ, హైకోర్టు న్యాయమూర్తి కృష్ణాజిల్లా ఇన్ఛార్జ్ పోర్టుపోలియో న్యాయమూర్తి రోహిణి నేడు ఉదయం 9.30 గంటలక విజయవాడ కోర్టులో ప్రారంభిస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి చక్రధరరావు తెలిపారు. మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ లోక అదాలత్ను ప్రారంభించిన అనంతరం నందిగామలో 12.15 గంటలకు 16వ అడిషనల్ జిల్లా సెషన్ కోర్టును ప్రారంభిస్తారని, మధ్యాహ్నం నూజీవీడులో విశ్రాంతి తరువాత 3 గంటలకు 15వ అడిషనల్ జిల్లా సెషన్ కోర్టును ప్రారంభిస్తారని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు బెజవాడ బార్ అసోసియేషన్ వార్షికోత్సవంలో పాల్గొని రాత్రికి విజయవాడలో బస చేస్తారన్నారు. 11న ఉదయం 10.45 గంటలకు కోర్టు భవనాలకు శంకుస్ధాపన చేస్తారని 11 గంటలకు విజయవాడలో 14వ అడిషనల్ జిల్లా సెషన్ కోర్టును ప్రారంభిస్తారని తెలిపారు. లోక్ అదాలత్ గురించి మాట్లాడుతూ జిల్లాలో కేసుల భారాన్ని తగ్గించడానికి ఈ కోర్టులు ఉపయోగపడతాయని ఆ ఉద్దేశంతో హైకోర్టు 3 కోర్టులను ఏర్పాటు చేసిందన్నారు. కక్షి దారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కోర్టులలో ఉన్న కేసులను రాజీ చేసుకుని వారి వ్యాఖ్యలను సామరస్యంగా ఉపసంహరించుకోవడానికి ఈ అదాలత్ ఉపయోగపడుతుందని పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more