One more shock to chandrababu naidu

Chandrababu Naidu, vijayawada tdp leader, bonda uma maheswara rao, gadde ramohan rao, vallabaneni vamsi, vijayawada mp ticket, chiranjeevi, congress party, tdp, chandra babu naidu padayatra,

one more shock to chandrababu naidu

chandrababu-naidu.gif

Posted: 04/04/2013 06:23 PM IST
One more shock to chandrababu naidu

one more shock to chandrababu naidu

తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు   విజయవాడ రాజకీయలపై ద్రుష్టి పెట్టినట్లు  తెలుస్తోంది.  బెజవాడలో రగులుతున్న రాజకీయ నేపథ్యంలో  చంద్రబాబు  కొత్త రాజకీయాలకు తెరలేపినట్లు  సమాచారం.  చంద్రబాబు స్వయంగా  బొండా ఉమామహేశ్వరరావుకు  కబురు పంపినట్లు తెలుస్తోంది.  గురువారం  పీఠాపురం  సమీపంలోని నెల్లిపూడి వద్ద  తనను కలవాలని చంద్రబాబు  కబురు పంపినట్లు టిడిపి నాయకులు అంటున్నారు.  చంద్రబాబు  పాదయాత్ర  అనంతరం  విజయవాడ నగర నేతలైన  వల్లభనేని వంశీమోహన్, బుద్దా వెంకన్న,  కేసినేని నాని,  నాగుల్ మీరాలతో  వేర్వేరుగా విభిన్న  అంశాలపై చంద్రబాబు  చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.  గద్దె రామ్మోహన్  కూడా  చంద్రబాబును  కలిసిన  సంగతి తెలిసిందే.  అయితే విజయవాడ లోక్ సభ  టిక్కెట్  తనకు ఇవ్వాలని  గద్దే రామ్మోహన్  చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది.  బొండా ఉమా కూడా  చంద్రబాబు ముందు తన మనసులోని మాటను బయటపెట్టడం జరిగింది.  తూర్పు నియోజకవర్గం  నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని బాబు ను బొండా ఉమా అడిగినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు.  ఈ సందర్భంలో  బాబు మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయం  తీసుకొనే విధంగానే ఉన్నారని పార్టీ నాయకులు అంటున్నారు.  రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా తయారయిందని ఆవేదన చెందారు. అదే సమయంలో ఆయన కొత్త వివాదానికి తెరదీశారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ పైన ఆయన సోదరుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. నెహ్రూ పైన పోటీ చేసేందుకు ఆయన సోదరుడే సరైన అభ్యర్థి అని చెప్పారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లానని గద్దె రామ్మోహన రావు చెప్పారు. గతంలో పార్టీ నేత వల్లభనేని వంశీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేవినేని నెహ్రూ పైన ఆయన సోదరుడు ఉమామహేశ్వర రావు పోటీ చేయాలన్నారు. ఇప్పుడు గద్దె అదే డిమాండును తెరపైకి తీసుకు వచ్చారు. కాగా, గద్దె రామ్మోహన రావు 1994లో గన్నవరం ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందారు. అదే టిక్కెట్ పైన హామీ ఇచ్చి చంద్రబాబు అతనిని పార్టీలోకి తీసుకు వచ్చినా సమీకరణాలు కుదరకపోవడం వల్ల 1999లో గన్నవరం కాకుండా విజయవాడ ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. 2004లో గద్దె విజయవాడ ఎంపి టిక్కెట్ ఆశించినా చిరంజీవి ప్రచారం చేస్తారని చెప్పి దానిని నిర్మాత అశ్వనీదత్‌కు ఇచ్చారట. గద్దెను మాత్రం కంకిపాడుకు పంపించారు. 2009లో గద్దె మరోసారి ఎంపి టిక్కెట్ ఆశించినా అది వల్లభనేని వంశీకి ఇచ్చారు. గద్దెను విజయవాడ తూర్పుకు పంపించారు. ఇప్పుడు ఆయన విజయవాడ ఎంపీ టిక్కెట్ తప్ప ససేమీరా అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Ugadi celebrations atop indrakeeladri  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more