Mlc elections at vijayawada

mlc elections at vijayawada, krishna-guntur districts graduates constituency mlc elections, congress party, lagadapati rajagopal, rayapati sambha

mlc elections at vijayawada

vijayawada.gif

Posted: 02/22/2013 12:53 PM IST
Mlc elections at vijayawada

mlc elections at vijayawada

కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి రెండవసారి జరుగుతున్న ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీడీపీ అభ్యర్థిగా మరోసారి పోటీపడుతున్న చిగురుపాటి వరప్రసాద్ గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. 2007 ఎన్నికలలో చిగురుపాటి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. చిగురుపాటికి ఈ పర్యాయం గట్టిపోటీ ఇస్తున్న అభ్యర్థులు కూడా విద్యారంగానికి చెందిన వారే కావడం విశేషం. ఆయనకు సీపీఎం, దాని అనుబంధ సం ఘాల తరఫున బొడ్డు నాగేశ్వరరావు, సీపీఐ మద్దతుతో ఎ.ఎస్.రామకృష్ణలు పోటీ ఇస్తున్నారు. బీజేపీ మద్దతుతో రంగంలో ఉన్న జూపూడి రంగరాజు, వైసీపీ మద్దతుతో పోటీ చేస్తున్న డాక్టర్ విష్ణు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంగిశెట్టి బాబురావు తనయుడు ఉమాశంకర్, బీజేపీ, టీడీపీలతో సన్నిహిత పరిచయాలు ఉన్న యేలేశ్వరపు జగన్మోహనరాజు కూడా రేస్‌లో ఉన్నారు. ఇప్ప టి వరకు ఎమ్మెల్సీగా పనిచేసిన చిగురుపాటిపై కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ అది ఆయన ఓటమికి దారితీసే స్థాయిలో లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రెండు జిల్లాలలో విద్యాధికులలో టీడీపీకి గట్టిపట్టు ఉండడంతో పాటు ఒక బలమైన సామాజికవర్గ మద్దతు ఉండ టం కూడా చిగురుపాటికి అనుకూలించే అంశమే.

mlc elections at vijayawada

వీటితోపాటు విద్యారంగంలో చిగురుపాటికి ఉన్న పేరు, ప్రఖ్యాతలు కొంతవరకు లాభించే వీలుంది. తాను ఎమ్మెల్సీగా ఉన్న ఆరేళ్లు టీడీపీ ప్రతిపక్షంలోనే ఉండడంతో తన ఆకాంక్షల మేరకు చేయాలనుకున్న పనులు చేయలేకపోయానని చిగురుపాటి అంటున్నారు. రాజకీయంగా కాని, వ్యక్తిగతంగా కాని వివరాలు, అవినీతి ఆరోపణలు ఏమీ లేకుండా చిగురుపాటి తన పదవీ కాలంలో జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే టీడీపీ తరఫున పోటీచేసి గత ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆయన పార్టీ కేడర్‌తో మమేకం కాలేకపోవడం ఒక మైనస్ పాయింట్. సమైక్యాంధ్ర ఉద్యమంలో గట్టిగా తనవాదాన్ని వినిపించారు. వామపక్షాలు విడివిడిగా తమ అభ్యర్థులను రంగంలోకి దింపడంతో వారి ఓట్లు చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. సీపీ ఎం, సీఐటీయూ గట్టి మద్దతు ఇస్తు న్న బొడ్డు నాగేశ్వరరావు విస్తృతంగా ప్రచారం చేశారు.  రెండు జిల్లాలలో ఉపాధ్యాయుల ఓట్లలో అత్యధిక శా తం తమకే పడతాయని సీపీఎం నేత లు అంచనా వేసుకుంటున్నారు. పీడీఎఫ్ అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చిన బొడ్డు నాగేశ్వరరావుపై తెలంగాణ అంశం కొంత ప్రభావం చూపించే పరిస్థితి ఉంది. ఆయనకు మద్దతు ఇస్తున్న పీడీఎఫ్ నాయకులైన చుక్కా రామయ్య, నాగేశ్వర్, లక్ష్మణ్, గేయానంద్, తదితరులు రాష్ట్ర విభజనను సమర్థించే వారు కావడంతో నాగేశ్వరరావును ఎన్నుకుంటే రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చినట్టే అవుతుందని ఆయ న వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. ఫోన్ల ద్వారా నాగేశ్వరరావుకు అనుకూలంగా, వ్యతిరేకంగా కూడా జోరు గా ప్రచారం జరుగుతోంది. కొంచెం ఆలస్యంగా రంగంలోకి దిగినప్పటికీ నాగేశ్వరరావు కూడా బాగానే పుంజుకున్నారు. ప్రధాన పోటీ చిగురుపాటి, నాగేశ్వరరావుల మధ్యే ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Poor voter turnout for mlc elections
Escalator construction works in vijayawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more