ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో టిటిడి ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులు అమలు చేయనున్నట్లు టిటిడి ఛైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టిటిడి పాలక మండలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం బాపిరాజు మాట్లాడారు. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు వైకుంఠ ఏకాదశి నుంచి ఉచితంగా ఒక లడ్డు ఇవ్వాలని టిటిడి పాలక మండలి నిర్ణయించినట్లు తెలిపారు.
తమ సమస్యలు పరిష్కరించాలి
తల నీలాల ద్వారా కోట్లు వస్తున్నాయి. కాని అక్కడ క్షురకులకు మాత్రం ఎలాంటి సౌకర్యాల ఉండవు. హీనంగా చూస్తున్నారని క్షురకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతంగా పోస్టులను భర్తీ చేస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారే కాని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు పేర్కొంటున్నారు. తాము మూడు సంవత్సరలుగా క్షౌర సేవ చేస్తున్నా టిటిడిలో శాశ్వత ఉద్యోగులుగా గుర్తించలేదని క్షురకులు ఆవేదన వ్యక్తం చేశారు.
టిటిడి ఛైర్మన్ కనుమూరి బాపి రాజును వీరు కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం క్షురకులు మీడియాతో మాట్లాడారు. తిరుపతి శ్రీవారి కళ్యాణ కట్టలో శ్రీవారి సేవ పేరుతో మూడు సంవత్సరాలుగా క్షౌర సేవ చేస్తున్నామని తెలిపారు. తమకు ఇంతవరకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని, దీనితో విజిలెన్స్ అధికారులు తమను హీనంగా చూస్తున్నారని క్షురకులు పేర్కొన్నారు. వెంటనే పోస్టింగ్ లకు నోటిఫికేషన్ ప్రకటించాలని, 1200 మంది క్షురకులకు గుండుకు ఏడు రూపాయల చొప్పున ఇవ్వాలని తాము టిటిడి ఛైర్మన్ ను కోరినట్లు తెలిపారు.
పది రోజుల్లో పరిశీలిస్తామని హామీనిచ్చారని పేర్కొన్నారు. తమ పట్ల కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని మహిళా క్షురకులు పేర్కొన్నారు. కనీసం పడుకోవడానికి సౌకర్యం లేదని, గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. 360 పోస్టులు ఇస్తామని చెప్పి ఇంతవరకు భర్తీ చేయలేదని తెలిపారు. వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని, తమను శాశ్వతంగా గుర్తించాలని కోరారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more