11 రోజుల పాటు శాంతియుతంగా రిలేనిరాహారదీక్షలు చేసిన నాల్గోతరగతి ఉద్యోగులు 12వ రోజు ఉద్యమ బాట పట్టారు. రుయా ఆసుపత్రి ప్రధాన భవనానికి తాళాలు వేశారు. రాకపోకలు జరగకుండా ప్రధాన ద్వారం వద్ద అడ్డంగా దీక్షా శిబిరాన్ని వేశారు. రుయా యాజమాన్యం, పోలీసులు కలుగజేసుకున్నా ఉద్యోగులు పట్టించుకోలేదు. 3 గంటలపాటు పూర్తి స్తాయిలో వైద్య సేవలను నిలిపివేశారు. దీంతో రోగులు, వారి బంధువులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కేవలం 3 గంటలపాటు ఉద్యమిస్తే ఏం జరుగుతుందో ¸ యజమాన్యానికి రుచి చూపించారు. వఖాళీగా వున్న పోస్టులను భర్తీచేసి,ఉద్యోగులపై ఉన్న అధిక పనిభారాన్ని తగ్గించాలన్న డిమాండుతో గత 12 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు.
అయనా కూడా రుయా యాజమాన్యం స్పందించటంలేదన్న తలంపుతో 12వ రోజు రుయాను దిగ్బందించారు. ఉదయం 8 గంటలకే ప్రధాన ద్వారానికి తాళాలు వేసి దీక్షా శిబిరాన్ని వేశారు. దాదాపు 3 గంటలపాటు రాకపోకలు నిలిపివేశారు. ఇది తెలిసి అలిపిరి పోలీసులు రుయా పరిపాలనాధికారి జె. వీరాస్వామి ఉద్యోగులకు, ఐ.ఎన్.టి.యు.సి జిల్లా నాయకులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. రుయా యాజమాన్యానికి ఏంచేయాలో దిక్కుదోచలేదు. అయితే 11 గంటల సమయంలో ఉద్యోగులు ధర్నాను విరమించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం 3 గంటలపాటు ఉద్యమిస్తే ఏం జరుగుతుందో యాజమాన్యానికి తెలియజేశారు. ఇకపై రోజుకు 3 గంటల పాటు ఇలాగే ధర్నాను నిర్వహిస్తామని హెచ్చరికలు జారీచేశారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more