అవినీతి నిరోధకశాఖ దెబ్బకు తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని పీఠాలు కదిలాయి. సబ్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి అటెండర్ వరకు మూకుమ్మడిగా బదిలీ చేస్తూ కర్నూలు డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. వారి స్థానంలో గురువారం నుంచి కొత్త ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. తిరుపతి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంపై గతేడాది డిసెంబర్ 15వ తేదీన ఏసీబీ అధికారు లు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కీలక రికార్డులు, రూ.2.2 లక్షల నగదు, ఒక వెండి పళ్లెం స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి అవినీతి వ్య వహారంపై సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్లు, కొందరు సిబ్బందిపై ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక పంపారు. ఆ నివేదిక ఆధారంగా ఉద్యోగుల ను ఉన్నపళంగా ప్రభుత్వం బదిలీ చే సింది. ఎవరూ కూడా డాక్యుమెంట్ రైటర్లు, దళారుల ప్రమేయంతో అక్కడ ఉద్యోగం చేయకూడదని, రిజిస్ట్రేషన్దారులకు ఇబ్బందుల్లేకుండా వెంటనే పనులు చేసి పెట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోనే తొలి సారిగా తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఈ బదిలీలకు శ్రీ కారం చుట్టారు. తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్ రాజగోపాల్ను కర్నూలుకు బదిలీ చేసి, ఆయన స్థానంలో ఇక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మోహన్బాబును ఇన్చార్జిగా నియ మించారు. సీనియర్ అసిస్టెంట్ వై.సుబ్రహ్మణ్యంను కూడా బదిలీ చేశారు. తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయంపై ఇటీవల ఏసీబీ అధికారు లు దాడులచేసి రూ.2 లక్షల నగదు, కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నా రు. వీరిపైనా ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై పరిశీలించిన ప్రభు త్వం తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరహాలో రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సబ్ రిజిస్ట్రార్తోపాటు అటెండర్ వరకు ప్రక్షాళన చేసి కొత్త వారిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more