Budget evokes mixed response in tirupati

Budget evokes mixed response in Tirupati

Budget evokes mixed response in Tirupati

Budget evokes mixed response in Tirupati.png

Posted: 02/27/2013 08:04 PM IST
Budget evokes mixed response in tirupati

పలు రైలు మార్గాలు, ఆధునిక సౌకర్యాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జిల్లా ప్రజలకు మూడు రైళ్లు, మూడు లైన్లు ఇచ్చి రైల్వే మంత్రి బన్సల్ తన చతురత చాటుకున్నారు. దక్షిణమధ్య రైల్వే ఆర్థిక రాబడిలో అత్యధిక వాటా సమకూరుస్తున్న చిత్తూరు జిల్లాకు ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా అన్యాయమే జరిగింది.రాష్ట్రానికి రైల్వే సహాయ శాఖ మంత్రి పదవి దక్కడంతో ఏదో జరిగిపోతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది.  జిల్లాలో దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలకు పరిష్కారం లభించలేదు. సర్వీస్ చార్జీల చాటున సామాన్యుల నడ్డివిరిచారు. 2008 రైల్వే బడ్జెట్‌లో సికింద్రాబాద్‌తో పాటు తిరుపతి స్టేషన్‌ను కూడా వరల్డ్ క్లాస్ స్థాయికి అభివృద్ధి చేస్తామని అప్పటి రైల్వే మంత్రి ప్రకటించారు.నాలుగేళ్లపాటు ఆ ప్రకటనను నాన్చుతూ వచ్చి చివరకు గత బడ్జెట్ తర్వాత దానికి తిలోదకాలిచ్చారు. ఆ తర్వాత వచ్చిన రైల్వే మంత్రి బన్సల్ తిరుపతిని మోడల్‌క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తీరా ఈసారి బడ్జెట్‌లో ఆ దిశగా ప్రకటన కూడా చేయలేదు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులతో నిత్యం అన్ని రైళ్లు తీవ్ర రద్దీతో నడుస్తాయి. దక్షిణమధ్య రైల్వే జోన్‌కు అత్యధిక ఆదాయం తిరుపతి నుంచే సమకూరుతోంది. ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉన్నా, రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ప్రతిసారీ చివరిస్థానమే దక్కుతోందనే విమర్శలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saina nehwal visits srikalahasti
Swiss watch with balaji image  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles