స్వామి కార్యం కన్నా స్వకార్యం మిన్న అన్నట్లు... ఇప్పటికే రాజకీయ, సినిమా నటుల సేవలో టిటిడి అధికారులు తరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే తాజాగా సర్కారి హారతి విషయంలో స్ధానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, టిటిడి ఈఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విఐపి విరామదర్శనంలో స్వామివారి సేవలో తిరుపతి ఎమ్మేల్యే తన అనుచరులతో వెంకన్నను దర్శించుకున్నారు. ఏడుకొండలవాడికి సాయంత్రం నైవేద్యం సమయంలో ముందుగా సర్కారు హరతిని ఇస్తారు. ఈహారతిని ప్రభుత్వం, భక్తుల పక్షాన ఈఓ తీసుకోవడం ఆనవాయితీ. ఐతే సర్కారు హరతిని గతంలో టిటిడిలో పనిచేసిన ఉన్నతస్థాయి ఉద్యోగులకు కల్పించేవారని ప్రస్తుతం ఈఓ ఏకాంతంగా దాదాపు పదినిమిషాలపాటు సర్కారు హారతి తీసుకున్నారని స్థానిక ఎమ్మేల్యే, మాజీ టిటిడి బోర్డు ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మేల్యే కరుణాకర్రెడ్డి చేసిన ఆరోపణలను టిటిడి ఈఓ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
తాను సర్కారు హరతిని భాద్యతగానే తీసుకుంటున్నానని, ఇది తనకు ఈఓ కావడంవలనే సంప్రాప్తించిందన్నారు. తన తరువాత ఎవరు ఈఓగా వచ్చినా వారు సర్కారు హరతిని తీసుకుంటారని చెప్పారు. స్థానిక ఎమ్మేల్యే వెంట వచ్చిన కార్యకర్తలకు ఆర్హత లేకపోయినా బ్రేక్ దర్శనంలో ప్రధాన్యత కల్పించామని, ఈ విషయాన్ని కూడా కరుణాకర్ రెడ్డి ప్రస్తావించి ఉంటే బాగుండేదన్నారు. స్వామివారి సన్నిధిలో సత్యాలు మాట్లాడాలని హితువు పలికారు. ఏది ఏమైనా 24 గంటలూ అధికారులు, నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా.. ఆ సమయాన్ని భక్తుల సౌకర్యాల విషయంలో దృష్టి పెడితే సమస్యలు వాటంతటవే సమసిపోతాయి.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more