భక్తుల తలనీలాలు తీసే విషయంలో సిబ్బంది కొరతతో సతమతమవుతున్న టీటీడీకి ఉచిత సేవ చేసే క్షురకుల వల్ల భారం తగ్గింది. శ్రీవారిసేవ కింద క్షురకులతో భక్తులకు తలనీలాలు తీసే కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. దీంతో భక్తులు తలనీ లాల సమర్పణకు వేచి ఉండే సమయం గంట కు మించటం లేదు. తిరుమలకు వచ్చే భక్తుల్లో రోజుకు 20 నుంచి 30 వేల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తున్నారు. ఏడాదికి 1.10 కోట్ల మంది గుండ్లు గీయించుకోవడం, మూడు కత్తెర్ల మొక్కు చెల్లిస్తున్నారు.
తిరుమల లో ప్రస్తుతం ప్రధాన కల్యాణకట్ట, మరో 19 చిన్న కల్యాణకట్టలు ఉన్నాయి. ఇక్కడ 281 మంది శాశ్వత ఉద్యోగులు, 320 మంది పీస్రేటు (గుండుకు రూ.7, కత్తెర్లకు రూ.3 చొప్పు) కార్మికులు పనిచేస్తున్నారు. శాశ్వత ఉద్యోగులు గంటకు 60 గుండ్లు, పీస్రేటు కార్మికులు 80 దాకా గుండ్లు, కత్తెర్లతో భక్తులకు సేవలందిస్తున్నారు.అయితే సరిపడ సిబ్బంది లేకతలనీలాలు సమర్పించేందుకు కనీసం ఆరేడు గంటలు వేచి ఉంటున్నారు.. రద్దీ రోజుల్లో ఈ సమయం మరింత పెరుగుతుండటంతో భక్తు లు ఆందోళనకు దిగిన సందర్భాలు కూడా ఉ న్నాయి. తిరుమలకు వచ్చే భక్తులకు సేవలందించే ఉద్దేశంతో టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో 2000 నవంబరు 21వ తేదీ శ్రీవారిసేవను ప్రారంభించారు. తొలుత 200 మంది సేవకులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు 3 వేల మందికి పెరిగింది. అన్నదా నం, వైకుంఠం క్యూకాంప్లెక్స్లు, సమాచార కేం ద్రాలు, క్యూలైన్లు, ఉద్యానవనం వంటి అనేక విభాగాల్లో సేవకులు స్వచ్ఛందంగా సేవలంది స్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more