ఆధునిక యుగంతో పరుగులు పెడుతున్న నేటి ప్రజలు అధిక రక్తపోటు సమస్య బారిన పడుతున్నారు. కాలక్రమంలో వీరి సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. దీని నుంచి ఎంత వీలైతే అంత త్వరగా ఉపశమనం పొందేలా మార్గాలు అన్వేషించాల్సి వుంటుంది. లేకపోతే.. ప్రాణం పోయే ప్రమాదం కూడా వుంటుంది. ఈ నేపథ్యంలోనే నిపుణులు దీనిని కంట్రోల్ చేసేందుకు వీలుగా కొన్ని చిట్కాలు పాటించాల్సిందిగా సూచిస్తున్నారు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..
హైపర్ టెన్షన్ తగ్గాలంటే.. బీట్ రూట్ రసం తాగాల్సిందే అంటున్నారు పరిశోధకులు. అధిక రక్తపోటు ఉన్నవారిలో కొందరికి మాత్రలకు బదులుగా 200 మి.లీ బీట్రూట్ రసాన్ని ఇచ్చి 24 గంటలపాటు పరిశీలనలో ఉంచారు. ఆ రసం తీసుకున్న కేవలం మూడు నుంచి ఆరు గంటల్లోనే 10 ఎంఎంహెచ్జి రక్తపోటు తగ్గిందని వారి పరిశోధనలో వెల్లడైంది. పైగా ఆ రసం ప్రభావంతో అధిక రక్తపోటు 24 గంటల దాకా నియంత్రణలోనే ఉన్నట్టు తేలింది. అందువల్ల అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు నైట్రేట్ సమృద్ధిగా ఉన్న కూరగాయలు ఆకుకూరలు తరుచుగా తీసుకోవడం ద్వారా తమ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.
అంతేకాకుండా, నైట్రేట్ సమృద్ధిగా ఉండే కూరగాయల్లోని నైట్రేట్లో అధిక రక్తపోటును తగ్గించేందుకు తోడ్పడే అంశాలున్నాయని స్పష్టమయ్యింది. మన శరీరంలో ఆహారంలోని నైట్రేట్ను నైట్రిట్ అనే రసాయనంగా ఆ తర్వాత నైట్రిక్ ఆక్సైడ్గా మార్చే గుణం ఉంది. దీనికి రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్తపోటును తగ్గించే గుణం ఉందని వివరించారు. కాబట్టి.. నిపుణులు సూచించిన చిట్కాలను పాటిస్తే.. రక్తపోటు సమస్యను కంట్రోల్ లో వుంచుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more