ఎండుద్రాక్ష (కిస్ మిస్)లో మానవ శరీరానికి కావలసిన అత్యవసరమైన పోషకాలు నిల్వవున్నాయి. వీటిని వంటకాల్లోగానీ, నేరుగాగానీ తీసుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వీటిని ప్రతిరోజూ డైట్ లో తీసుకుంటే ఆరోగ్యంగా వుండవచ్చునని ఆరోగ్య నిపుణులు సైతం సూచిస్తున్నారు. కాబట్టి.. ఈ కిస్ మిస్ ఎంత ఎక్కువగా తింటే.. ఆరోగ్యానికి అంతే మంచిది. మరి.. ఈ ఎండుద్రాక్షలో వున్న పోషకాలు ఏంటో..? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..
* రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో కిస్ మిస్ పండ్లు ఎంతో సహకరిస్తాయి. దీంతో రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలాగే.. ఎండు ద్రాక్షల్లోని ధాతువులు రక్తంలోని రక్తకణాలను పెంచుతాయి. పచ్చకామెర్ల వ్యాధిగ్రస్థులు రోజూ రెండు పూటలా ఎండుద్రాక్షలను తీసుకుంటే.. ఆ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చునిని వైద్యులు చెబుతున్నారు.
* గొంతురాసినట్లుగా అనిపిస్తే.. రాత్రి నిద్రపోవడానికి ముందు 20 ఎండు ద్రాక్షలను తీసుకుని ఆవుపాలలో వేసి మరిగించాలి. కొద్దిసేపు తర్వాత అందులో 10 మిరియాలు చేర్చి మళ్లీ మరిగించాలి. ఇలా తయారుచేసుకున్న ఈ మిశ్రమాన్ని తాగితే.. గొంతు సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
* నెలసరి సమయాల్లో ఏర్పడే నొప్పిని తగ్గించాలంటే.. ముందుగా ఒక పాత్రలో 20 ద్రాక్షపండ్లను తీసుకుని, రెండు గ్లాసుల నీరు, సోపు గింజలు, ఒక టీ స్పూన్ చేర్చాలి. ఈ మొత్తాన్ని కషాయంలా తయారు చేసి తాగాలి. ఇలా మూడు రోజులు రెండు పూటలా తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
* ఎండుద్రాక్షల్ని గోరువెచ్చని నీటిలో అరగంట పాటు నానబెట్టి పరగడుపున తీసుకుంటే.. నెలసరి సమస్యలు దరిచేరవు. హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
* ఎండుద్రాక్షల్లో క్యాల్షియం అధిక మోతాదులో నిల్వ వుంటుంది. ఇది ఎముకలకు బలాన్ని, దంతాల పటిష్టతకు సహాయపడతుంది.
* పిల్లలకు ఇచ్చే పాలను మరిగించేటప్పుడు.. అందులో 2 ఎండుద్రాక్షలు వేసి వడగట్టి తాగిస్తే దేహపుష్ఠి చేకూరుతుంది.
* 50 ఎండుద్రాక్షల్ని శుభ్రం చేసి ఆవుపాలలో వేసి మరిగించాలి. కొద్దిసేపు ఆరిన తర్వాత ఆ ద్రాక్షలను తీసుకుని, పాలను సేవిస్తే అజీర్తి సమస్యలు ఉండవు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more