శ్రీ మహావిష్ణువు లోకంలో సాధుపరిరక్షణ కోసం, దుష్టశిక్షణ కోసం ఎన్నో అవతారాలను యుగాలను బట్టి అవతరిస్తాడు. ఆయన 21 అవతారాలలో ముఖ్యమైనవి 10 అవతారాలను దశావాతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారమే ఈ నరసింహావతారం.
శ్రీ మహావిష్ణువుని నరసింహావతారం జన్మ వృత్తాంతం :
పూర్వం కశ్యప ప్రజాపతి భార్య అయిన దితి గర్భంలో.. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అనే ఇద్దరు మహావీరులు జన్మించారు. వీరిద్దరిలో హిరణ్యాక్షుడు చాలా బలవంతుడు కావడంతో... అతను గర్వంగా దేవతలను హింసిస్తూ... వారితో యుద్ధాలు చేసి గెలుస్తూ.. అందరినీ భయపెట్టేవాడు.
అలాగే పాతాళ అంతర్గతమైన భూదేవిని, శ్రీవరాహమూర్తి అవతారంలో వున్న శ్రీమహావిష్ణువును యుద్ధానికి పిలిచాడు. అప్పుడు వారి మధ్య కొన్నిసంవత్సరాలపాటు భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. సోదరుడైన హిరణ్యకశిపుడు చేసేదేమీలేక తన సోదర మరణానికి చింతిస్తూ.. తల్లిదండ్రులను ఓదార్చుతూ కాలం గడిపేవాడు.
కొన్నాళ్ల తరువాత హిరణ్యకశిపుడు తన రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి, మందరగిరికి వెళతాడు. అక్కడ ఘోరమైన తపస్సును ఆచరించాలని నిశ్చయంతో తపం చేయడం మొదలుపెడతాడు. ఇలా ఇతని తపస్సు ఉగ్రతకు యావత్ లోకాలు కంపించాయి. అతని శరీరంలో కేవలం ఎముకల గూడు మాత్రమే మిగిలింది.
హిరణ్యకశిపుని తపస్సును మెచ్చుకుని బ్రహ్మ అతని ముందు ప్రత్యక్ష్యమవుతాడు. తన శక్తులతో అతని శరీరాన్ని నవయవ్వనంగా, మార్చేసి.. వరం కోరుకోమని చెబుతాడు. ఇదే అదునుగా భావించి హిరణ్యకశిపుడు.. ‘‘తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, దేవదానమనుష్యులవల్లగాని, జంతువులవల్లగాని మరణం సంభవించకూడదని కోరుకున్నాడు. బ్రహ్మ తన వరాన్ని అనుగ్రహించి.. అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
దీంతో తనకు చావు లేదన్న గర్వంతో హిరణ్యకశిపుడు దేవతల మీద దండెత్తి, వారి అధిష్టానాలను ఆక్రమించుకునేవాడు. పంచభూతాలను నిర్బంధించేశాడు. తపం చేసుకునే సాధువులను, మునులను హింసించేవాడు. సర్వలోకాలలో వున్న ప్రతిఒక్కరిని భయభ్రాంతులు చేసి, తన అధీనంలో పెట్టుకునేవాడు.
దేవతలందరూ ఇతనికి భయపడిపోయి విష్ణువును ప్రార్థిస్తారు. దేవతలు.. ‘‘ఓ మహాదేవా! ఇతని నుంచి విముక్తి పొందడానికి మార్గమేమీ లేదా?’’ అని అడగగా... విష్ణువు ప్రత్యక్షమై.. ‘‘హిరణ్యకశిపుడు తన కన్నకొడుకునే ఆపద తలపెట్టే సమయంలో నేను అతనిని వధిస్తాను. మీరు చింతించకండి’’ అని వారికి ధైర్యాన్ని సమకూరుస్తాడు.
ఇదిలావుండగా... హిరణ్యకశిపుడు మందరగిరిలో తపస్సు చేసుకుంటుండగా.. దేవతలు అతని రాజ్యంపై దండెత్తి, మొత్తం కొల్లగొట్టుకున్నారు. గర్భవతియైన తన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా.. అదే సమయంలో నారదుడు అక్కడికి వచ్చి ఆమెను కాపాడుతాడు. ఇంద్రునుని మందలించి, ఆమెను తన ఆశ్రమానికి తీసుకునివెళతాడు. ఆశ్రమంలో వున్నప్పుడు నారదుడు ఒనర్చిన భాగవత తత్వబోధను.. ఆమె గర్భంలో వున్న ప్రహ్లాదుడు గ్రహిస్తాడు. హిరణ్యకశిపుడు తిరిగి తన రాజ్యానికి చేరుకున్నప్పుడు.. నారదుడు అతని ధర్మపత్నిని అప్పగిస్తాడు.
ప్రహ్లాదుని జన్మం :
గర్భంతో వున్న హిరణ్యకశిపుని భార్య, నారదుని ఆశ్రమంలో వున్నప్పుడు... నారదుడు భాగవతాన్ని చదువుతాడు. ఆ సమయంలో ఆమె గర్భంలో వున్న ప్రహ్లాదుడు దానిని గ్రహిస్తాడు. దాంతో అతను పరమ భాగవతుడిగా మారిపోతాడు. అడుగడుగునా మధువుని గురించి ఆలోచించేవాడు. సర్వభూతాలతో సమాన భావం కలిగిగవాడు వుంటాడు.
ఒకరోజు రాక్షసరాజు (హిరణ్యకశిపుడు) తన కొడుకైన ప్రహ్లాదునికి విద్య నేర్పించడమని, తన రాజ్య ప్రవృత్తికి అనుగుణంగా మలచమని కులుగురువులైన చండామార్కులకు అప్పగించాడు.
కొన్నిరోజుల తరువాత హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదునిని పిలిచి... ‘‘నువ్వు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రం?’’ అని ప్రశ్నిస్తాడు. ప్రహ్లాదుడు సమాధానంగా.. ‘‘విష్ణువుతో హృదయాన్ని లగ్నం చేయడం మేలు’’ అని చెబుతాడు. దాంతో హిరణ్యకశిపుడు కోపంతో.. ‘‘రాక్షసులని వుండకూడని ఈ బుద్ధి నీకు ఎక్కడినుంచి వచ్చింది?’’ అని మండిపడతాడు.
తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు తన కొడుకైన ప్రహ్లాదునినే కఠినంగా శిక్షించమని తన రాజ్యంలో వున్నవారికి ఆజ్ఞాపిస్తాడు హిరణ్యకశిపుడు. అయితే అతనిని శులాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా ప్రహ్లాదునికి ఎటువంటి బాధ కలుగలేదు. అతడు హరినామస్మరణం చేస్తూనే వుంటాడు. దాంతో రాజు మరింత కోపాద్రిక్తుడైపోతాడు.
అక్కడికి చేరుకున్న రాక్షసగురువు.. ‘‘ఇంకొక అవకాశం ఇవ్వండి’’ అని కోరుకుని, ప్రహ్లాదునిని గురుకులానికి తీసుకుని వెళతారు. అక్కడ కూడా ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస విద్యార్థులకు, బాలురకు ఆత్మజ్ఞానం, హరితత్వం, మోక్షజ్ఙానం గురించి ఉపదేశించడం మొదలుపెట్టాడు. చివరికి గురువులు కూడా ఏమీ చేయలేక అతనిని తీసుకుని తిరిగి రాజు దగ్గరకు వెళతారు.
నరసింహా ఆవిర్భావం :
కోపంతో ఊగిపోతున్న హిరణ్యకశిపుడు... ‘‘నేనంటే సకల భూతాలే భయపడుతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇప్పుడు నీకు దిక్కెవరో నేను చూస్తాను? నాకంటే బలవంతుడు ఎవరూ లేరు?’’ అని ప్రహ్లాదుని మీద గద్దించాడు. దానికి సమాధానంగా... ‘‘అందరికీ బలమెవరో.. ఎవరు దిక్కో ఆ విభుడే నన్ను కాపాడడానికి ఇక్కడికి వస్తాడు’’ అని ప్రహ్లాదుడు చెబుతాడు.
అప్పుడు రాజు.. ‘‘అయితే ఈ స్తంభంలో నీ రాజును చూపించగలవా?’’ అని ప్రశ్నించాడు. ప్రహ్లాదుడు.. ‘‘బ్రహ్మ నుంచి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడు అయి వుండేవాడు... ఈ స్తంభంలో ఎందుకు వుండడు? ఇందులో ఏ సందేహం లేదు. ఈ స్తంభం అంతర్గతంలో అతను కొలువైవున్నాడు. నేను గానం ఆచరిస్తే.. ప్రత్యక్ష స్వరూపంలో ఇక్కడికి చేరుకుంటాడు’’ అని చెబుతాడు.
హిరణ్యకశిపుడు.. ‘‘ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నేను ప్రాణాలు తీసుకుంటాను. అప్పుడు ఏ హరి వచ్చి నిన్ను అడ్డుకుంటాడో చూస్తాను’’ అని అతని స్తంభంపై చేతితో తాకుతాడు. బ్రహ్మాండ కటామం బద్ధలయిపోయి.. ఆ స్తంభంలో నుంచి మహాప్రభువైన శ్రీ నరసింహదేవుడు ఆవిర్భవిస్తాడు.
హిరణ్యకశిపుడు అతనిని చూసి ఒక్కసారిగా భయంతో ఏమీచేయలేక అలాగే వుండిపోతాడు. శ్రీ నరసింహడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసి పట్టుకుని, తన ఒడిలో వేసుకుని, తన గోళ్లతో చీల్చి చండాడాడు. ఇలా ఈ విధంగా శ్రీహరి.. నరసింహ అవతారమెత్తి రాక్షసుడైన హిరణ్యకశిపునిని తన తొడపైన సంహరించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more