స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రునికి అహంకారం ఎక్కువ. భువిపై వున్న మానవులందరూ తన దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉన్నారనీ, తనని భయభక్తులతో కొలిస్తే కానీ వారికి మనుగడ వుండదని విర్రవీగుతుంటాడు. అయితే.. కృష్ణుడు అతని గర్వాన్ని మాత్రం ఎప్పటికప్పుడు భంగపరుస్తుంటాడు. అందుకు ఉదాహరణగా గోవర్ధనగిరి కథనే తీసుకోవచ్చు. గోకులం మీద ఇంద్రుడు కుండపోత వర్షం కురిపిస్తుండగా.. అప్పుడు కృష్ణుడు తొలిసారి గోవర్థన గిరిని ఎత్తి అతనిని చిన్నబుచ్చుతాడు. ఆ తరహాలోనే వీరిద్దరి మధ్య మరో ప్రచ్ఛన్నయుద్ధంగా జరగగా.. అందులోనూ కృష్ణుడే నెగ్గి అతని అహంకారాన్ని మలుచుతాడు. ఆ కథేంటో తెలుసుకుందామా..
పూర్వం.. ఓ సందర్భంలో కృష్ణార్జునులు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ‘ఖాండవవనం’ అనే దట్టమైన అడవి ప్రాంతానికి వెళతారు. వారిద్దరూ ఆ వనంలో సేదతీరుతూ, యమునానదీ తీరాన విడిది చేసి ఉండగా... ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. `తాను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాననీ, తన వ్యాధిని నయం చేయగల పరిష్కారం కృష్ణార్జునుల వద్దనే ఉందనీ, దయచేసి తనను అనుగ్రహించమనీ` వారిద్దరినీ వేడుకుంటాడు. అతని ఆవేదనను విన్న అనంతరం వారిరువు ‘సరే’ అని సహాయపడతారు. వారిద్దరి అభయాన్ని పొందిన తరువాత ఆ బ్రాహ్మణుడు తన అసలు రూపాన్ని ధరిస్తాడు. అతను ఎవరో కాదు అగ్నిదేవుడే! ఆ అగ్నిదేవుడు ఎన్నో రోజులుగా ఖాండవవనాన్ని దహించాలని అనుకుంటున్నాడు. అలా చేయడం వల్ల అతని ఆకలి తీరడమే కాదు, అక్కడ ఉండే భూమి మరింత సారవంతంగా మారుతుంది. జీవరాశులు మళ్లీ కొత్త ఊపిరిని పోసుకుంటాయి. కానీ ఆ అడవిలో ఇంద్రుని స్నేహితుడైన తక్షుడు అనే సర్పరాజు నివాసం ఉంటున్నాడు. అతనిని కాపాడటం కోసం, ఇంద్రుడు ప్రతిసారీ అగ్నిదేవునికి అడ్డుపడుతుంటాడు. అగ్నిదేవుడు అడవిలో చెలరేగిన ప్రతిసారీ, ఇంద్రుడు వర్షాన్ని కురిపించి అతడని ఆర్పివేస్తున్నాడు. దాంతో విసిగిపోయిన అగ్నిదేవుడు.. కృష్ణార్జునుల శరణుకోరాడు. అప్పుడు వారిద్దరూ అతనికి సహాయపడేందుకు సిద్ధమవుతారు. అందుకోసం అర్జునుడికి వరుణుడు ‘గాండీవం’ అనే ధనుస్సుని కూడా అందించాడు. అలా అర్జునుడు గాండీవిగా స్థిరపడ్డాడు.
ఇక అగ్నిదేవుడు తన జ్వాలల కోరలను ఖాండవవనం మీదకి చాచాడు. చెట్టూచేమా, పిల్లామేకా... అన్నీ అగ్నికి ఆహుతికాసాగాయి. ఇంద్రుడు యథాప్రకారం అగ్నిని అడ్డుకునేందుకు వర్షధారలను కురిపించడం మొదలుపెట్టాడు. అయితే అందులోని ఒక్క చుక్క కూడా నేల మీదకి పడకుండా అర్జునుడు తన బాణాలని వనం మీద అడ్డుగా నిలిపాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఒక్క చుక్క నెలమీద పడకపోవడంతో తన ప్రయత్నం వృథా అయిందని భావించిన ఇంద్రుడు.. నేరుగా భువికి దిగివచ్చి కృష్ణార్జునులతో యుద్ధం చేస్తాడు. అయినా లాభం లేకపోయింది. ఆయువు ముగిసిన ఏ ఒక్క ప్రాణినీ కృష్ణార్జునులు వదిలిపెట్టలేదు. మరోపక్క అగ్నిదేవుడు ఒక్క గడ్డిపరక కూడా మిగలకుండా ఖాండవనాన్ని దహించివేశాడు. ఇలా ఈ విధంగా కృష్ణార్జునుల సాయంతో అగ్నిదేవుడు తన కర్తవ్యాన్ని పూర్తి చేసి, ప్రకృతి ధర్మాన్ని పాటించాడు.
(And get your daily news straight to your inbox)
Nov 18 | పూర్వం భక్తులు తమతమ ఇష్టదైవాలను ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే.. సాక్షాత్తూ దేవుళ్ళే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోర్కెల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వరుడు మెప్పించిన అపరభక్తుడు బావాజీ.. ఆయనతో కలిసి... Read more
Nov 06 | పూర్వం.. చ్యవనుడు అనే మహర్షికి సుకన్య అనే రాజకుమార్తెతో వివాహం అయ్యింది. చ్యవనుడు అంధుడు మాత్రమే కాకుండా చాలా ముసలివాడు అయినప్పటికీ.. కుందనపుబొమ్మలా వుండే సుకన్య తన యవ్వనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పతివ్రతా నియమంతో... Read more
Oct 07 | పూర్వం ‘పులోమ’ అనే అతిలోక సౌందర్యవతి వుండేది. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన ‘పులోముడు’ అనే దైత్యుడు.. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా అనుకున్న వెంటనే తన మనోరథాన్ని పులోమ తండ్రికి తెలిపాడు.... Read more
Sep 22 | మహాభారతంలో కీలకపాత్రుడైన కర్ణుడు.. ఆనాడు దాకకర్ణుడనని ప్రసిద్ధి. తనకు తోచించి ఇతరులకు దానం చేయడంలో ఇతను దిట్ట. బంగారమైనా, మరేమైనా సరే.. దానం చేయడంలో కర్ణుడిని మించినవాడు ఎవడూ లేడు. పైగా.. కృష్ణుడు సైతం... Read more
Jul 03 | రామాయణంలో వున్న ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క కథామిషూ వుంటుంది. వారు మంచివారయినా కావొచ్చు... లేదా ధర్మానికి విరుద్ధంగా నడుచుకునే హీనులైనా అయి వుండొచ్చు. అటువంటి పాత్రలలోనే ‘‘వాలి’’ కథ కూడా ఒకటి. పూర్వం వాలి,... Read more