‘‘శరణు’’ అంటే రక్షణ కోసం వేడుకోవడం. ఆ రక్షణ ఇచ్చేవాడు దేవుడు. సాధారణంగా మానవులు తనకు ఆపదలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోలేక తన ఇష్టమైన దేవాన్ని రక్షణ కోసం వేడుకుంటారు. అలాగే మరికొందరు తమ కోరికలు నెరవేరటానికి భగవంతున్ని కోరుకుంటారు. ఇంకొందరు వారు చేసే కర్మకార్యములలో ఫలం కోసం వేడుకుంటారు. ఇలా చెప్పుకుంటూపోతే.. మానవుడు భగవంతుడ్ని ఎన్నో రకాలుగా శరణు వేడుకుంటారు. ఒకవేళ వారి కోర్కెలు నెరవేరితే.. భగవంతుడు వున్నాడు.. మనల్ని రక్షిస్తున్నాడు అనే భావనలతో సంతృప్తి చెందుతారు. కానీ అనన్య శరణాగతి వేడిన భక్తుడు దేని గురించి ఆలోచించకుండా, భయపడకుండా వుంటాడు. ఎందుకంటే.. శ్రీకృష్ణ పరమాత్మడు చెప్పినట్లుగా.. సర్వధర్మ ఆశ్రములను విడిచి భక్తుడు.. ఆ కృష్ణుడికి శరణు పొందిన పిదప ఆ పరమాత్ముడు తనను నమ్మకున్న భక్తుడి సమస్తా పాపాలనుండి రక్షింస్తాడు. ఒకవేళ అనన్య శరణాగతుడు అయిన భక్తుడు తన కార్యములలో ఎటువంటి మార్పు రాకపోతే దాని గురించి చింతించకోకుండా... దానికి గల కారణాలు, భాధ్యతల్ని తన నమ్ముకున్న భగవంతుడి బాధ్యతే అని ధృఢ విశ్వాసంతో వుండాలి. ఒక్కసారి భక్తుడు శరణు కోరిన తరువాత దాని గురించి చింతిచినా శరణాగతికే అది కళంకితమవుతుంది. దానికి గల కారణం.. తన విశ్వాస లోపమే.
శరణాగతి వేడిక వ్యక్తి.. తను భగవానునికి చెందిన వ్యక్తి అని, అదే విధంగా పరమాత్ముడు కూడా తన వాడు అనే భావనతో నమ్మకం కలిగి వుంటాడు. అయితే శరీరము అనే భావన కలిగిన ప్రతి ఒక జీవికి కోరికలు కలిగి.. బాహ్యప్రపంచం, భగవానుడు, అతడు వేరువేరు అని అని భావించి ఇంద్రియలోలుడై తన తపస్సు, బుద్ధి, ఇంద్రియములు, శరీరం వంటి వాటిపై మమకారం ఏర్పడి.. తాను భరించే బాధలను భరించలేక రక్షణ కోసం పరమాత్మను వేడుకుంటాడు. ఈ విధంగా జీవి తన ఇష్టాయిష్టాలకు లోనై సంసారంలో సుఖదు:ఖాలు అనే ఆటుపోట్లను భరించలేక భగవంతుడిని తన బాధ గురించి వేడుకోవడమే కాక.. ఆ పరమాత్ముడిని కూడా బాధ పెడతాడు. జనన మరణ అనే బంధములతో చిక్కకుంటాడు. జీవి తన మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, శరీరంపై మమకారం పెంచుకోవడమే తప్పు. ఒక్కసారి భగవంతుడుకి అనన్య శరణాగతుడైతే సర్వం మొత్తం ఆ పరమాత్మడికి సమర్పించినట్లే లెక్క. అటువంటి స్థితిలో ఆ జీవి తన శరీరం, ఇంద్రియము, మనస్సు, బుద్ధి వంటి వాటన్నింటినీ మరచి.. ఏమిలేని వాడిగా భావించి ‘‘నేనెవరిని’’ అని గుర్తించుకుంటాడు. అదే విధంగా జీవి శరీరం తనది కాదని... బుద్ధి, ఇంద్రియములు శరీరానికి సంబందించినవని భావించి.. అవి మినహాయిస్తే మిగిలిన అదే ఆత్మ పరమాత్మ అని చైతన్యపరుచుకుంటాడు. ఇక జీవి, దేవుడు, ప్రపంచం వనే అనేది ఎక్కడ? వున్నది ఒక్కటే అదే పరమాత్మ. జీవియే పరమాత్మ అయినప్పుడు శరణు దేనికోసం కోరటం? ఆ స్థితిని తెలుసుకోవాలని దేవుడికి శరణు వేడుకోవాలి. అత్మావలోకన, ఆత్మ సాక్షాత్కారము మరియు ఆత్మ దర్శనము ఇవన్నీ ఒక్కటే. వీటిని గురించి తెలియాలి అనుకుంటే.. ‘‘నేనెవరిని’’ అనే ప్రశ్నకు జవాబుకై ‘‘భగవాన్ శ్రీ రమణ మహర్షి’’ గారిని శరణు వేడుదాం.. ఆ రమణుడే మనకు శరణాగతి.. అందుకే రమణ శరణాగతి.
భగవద్గీతలో శ్రీకృష్ణడు మహాత్ములు తన ఆత్మ అని, తన సజీవ ప్రతిమ అని, తానే వారికి చెందినవాడని, వారు తనకి చెందిన వారని చెప్పారు. అలాంటి మహాత్ములలో ఒకరే ఈ భగవాన్ రమణ మహర్షి.
రమణ మహర్షి గురించి :
భగవద్గీతలో శ్రీకృష్ణడు మహాత్ములు తన ఆత్మ అని, తన సజీవ ప్రతిమ అని, తానే వారికి చెందినవాడని, వారు తనకి చెందిన వారని చెప్పారు. అలాంటి మహాత్ములలో ఒకరే ఈ భగవాన్ రమణ మహర్షి.
తమిళనాడు రాష్ట్రంలో ‘‘తిరుచ్చళి’ అనే గ్రామం మధురకు దగ్గరలో వుంది. ఆ గ్రామంలో శ్రీ సుందరమయ్యగారు, వారి భార్య అలగమ్మ వుండేవారు. సుందరమయ్యగారు ఒక లాయరు. వీరి ఇళ్లు బంధుమిత్రులతో ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. ఆధ్యాత్మికతలో వారి చెప్పుకునే విశిష్టత ఏమీ లేదు. అప్పుడప్పుడు గుడికి వెళ్లి భక్తి చూపడం తప్ప అంత విశేషమైన శక్తి లేదు. సుందరమయ్యగారి వంశములో వారి తాతముత్తాలనుండి ఒక శాపము వెంటాడుతూ వస్తోంది. అదేమిటంటే... వారి వంశములో ప్రటి ఒక్క తరములో ఒకరు సంసార జీవితాన్ని త్యజిస్తారు. సుందరమయ్య గారి పెద్ద తండ్రులలో ఒకరు కాషాయ వస్త్రాలు ధరించి సన్యసించారు కూడా. సుందరమయ్యగారిని ముగ్గురు కుమారులు. ఒకరు నాగస్వామి రెండవవారు వెంకట రామన్ (భగవాన్ రమణ మహర్షి) ఆఖరి వారు నాగ సుందరుడు. సుందరమయ్యగారికి ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు శాపానికి గురవుతారని నమ్మకం వుండేది.
1879 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ అంటే పునర్వసు నక్షత్రంనాడు అర్థరాత్రి భగవాన్ మహర్షి అవతరించాడు. మొత్తం ప్రపంపచానికే వెలుగు చూపుడానికి, ఆత్మ అవలోకనము గురించి వివరించడానికి ఒక సామాన్యమైన కుటుంబంలో రమణుడు జన్మించారు. తండ్రయిన సుందరమయ్య ఈయనకు వెంకట రామన్ అనే పేరు పెట్టారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | మానవుడు ప్రకృతిలో వున్న అందాలను, మాయకు లోబడి, ఇంద్రియాలకు లోనయి అనేకరకాల ప్రవృత్తుల (లక్షణాలు)తో ప్రవర్తిస్తుంటాడు. కొందరు ఒక్కొక్క రకమైన లక్షణాలను కలిగివుంటే.. మరికొందరిలో అన్ని లక్షణాలు ఇమిడి వుంటాయి. అవి తామసిక, రాజసిక,... Read more
Mar 20 | సాధారణంగా సామాన్య మతాచారులు, గురువులు దగ్గరకు శిష్యులు వెళ్లి, లైనుల్లో నిల్చుని.. వారి ఆశీర్వచనాలు, ప్రసాదాలు తీసుకుంటుంటారు. కానీ... భగవాన్ బాబా స్వామి అయితే తాము స్వయంగా భక్తుల దగ్గరకు వెళ్లి వారికి స్వాంతనను... Read more
Feb 17 | వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక జ్ఞానపీఠం, చిలకలూరి పేట అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది. అసలు జన్మలు 3 రకాలు. అవి దేవజన్మ, మానవజన్మ, జంతుజన్మ. అవి ఎలా వస్తాయి..? వాటి ప్రత్యేకత ఏమిటి..?... Read more
Feb 14 | నాది, నేను అన్న భావనలు, కోరికలే దు:ఖ హేతువులు. భూమి మీద జన్మించే ప్రతి మానవుడూ తన కోసం ధనాన్నో, వస్తువులనో సంపాదించుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటారు. కోరికలను జయిస్తే పరమాత్మకు దగ్గరవుతాము. బౌద్ధ... Read more
Feb 14 | ప్రేమే నేను - నేనే ప్రేమ ‘‘ప్రేమ నా స్వరూపము.. నా స్వభావము.. ప్రేమే నేను. నేనే ప్రేమ’’.. అంటారు భగవాన్ సాయి. ‘‘నా జీవితమే నా సందేహం. ప్రేమే నా సందేశం’’ అంటుంటారు.... Read more