కథ :
పూర్వం ఒకనాడు ఒక బ్రాహ్మణ దంపతులకు ఒక కుమార్తె వుండేది. ఎంతో సుఖసంతోషాలతో జీవన విధానాన్ని కొనసాగిస్తున్న వీళ్లూ... హఠాత్తుగా బ్రాహ్మణ ఇల్లాలు చనిపోతుంది. దీంతో బ్రాహ్మణుడు తన కూతురితోనే కలిసి ఒంటరిగా జీవితాన్ని కొన్నాళ్లపాటు సాగించాడు.
ఇలా కొన్ని కాలాలపాటు గడిచిన తరువాత బ్రాహ్మణుడు ఇంకొక పెళ్లిని చేసుకున్నాడు. బ్రాహ్మణ బాలిక కూడా సవతి తల్లితో ప్రేమగా వ్యవహరిస్తూ.. చెప్పిన విధంగానే నడుచుకునేది. అయితే సవతి తల్లి మాత్రం ఆ బ్రాహ్మన బాలికను తీరిక లేకుండా నిత్యం హింసించేది. సమయానికి భోజనం కూడా పెట్టేది కాదు.
దీంతో ఆ బ్రాహ్మణ బాలిక సవతి తల్లి పెట్టే హింసను, దారిద్ర్యాన్ని భరించలేక... ప్రతిరోజూ శివలింగం ముందు కూర్చొని దు:ఖిస్తుండేది. రోజూ శివుడిని ఎంతగానో ఆరాధించి, ప్రార్థించేది.
ఇలా ఆమె ప్రతిరోజూ శివుని దగ్గరకు వెళ్లి బాధపడుతుండగా... ఒకరోజు శివుడు ప్రత్యక్షమయి.. ‘‘పుత్రికా! నువ్వు చింతచకు. గతంలో నువ్వు మొగ్గ దోసిళ్ల నోము నిర్వహించి, మధ్యలోనే ఉల్లంఘించడం వల్ల ఈ కష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు దానిని తిరిగి యధాప్రకారం ఆచరించు. సవతి తల్లి నిన్ను బాధపెట్టడం మానేస్తుంది. అన్ని దరిద్ర్యాలు తొలగిపోయి సుఖంగా జీవితస్ావు’’ అని చెప్పి వెళ్లిపోయాడు.
అది విన్న బాలిక... శివుడు చెప్పిన విధంగా మొగ్గ దోసిళ్ల నోమును యధాప్రకారంగా మొదలుపెట్టింది. సంవత్సరం గడిచిన తరువాత బాలిక సవతి తల్లి మనసు మార్చకుని, ఆమెను ఎంతో ప్రేమగా చూసుకోసాగింది. అలాగే సంపన్నుడు, ధనవంతుడైన యువకునితో ఈమె వివాహం జరిగి.. సర్వదారిద్ర్యాలు తొలగిపోయాయి.
విధానం :
ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే రోజువారి కార్యక్రమాలు ముగుంచుకోవాలి. స్నానం చేసే సమయంలో ఒక పళ్లెంలో పసుపు తీసుకుని, దానిమీద మూడు దోసిళ్ల నీటిని పోయాలి. తరువాత దానిని ఒంటికి రాసుకుంటూ శివుణ్ణి స్మరించుకోవాలి. పైన చెప్పిన కథను ఒక సారి చెప్పుకుని.. నమస్కారం చేసుకోవాలి. ఇలా సంవత్సరం పొడవు రోజూ చేయాలి. తరువాత ఉద్యాపనం చేయాలి.
ఉద్యాపన :
ప్రతిరోజూ శివాలయానికి మూడు దోసిళ్ల పువ్వులు, మూడు దోసిళ్ల పగడాలు, మూడు దోసిళ్ల ముత్యాలను తీసుకునివెళ్లాలి. వాటిని శివుడికి ధారబోసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. వారిచ్చిన ఆశీస్సులను అందుకోవాలి.
ఇలా సంవత్సరం వరకు తూచాతప్పకుండా పాటిస్తే.. శివుడు అనుగ్రహించి సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని, సంపన్నుడైన భర్తను ప్రసాదిస్తాడు.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: -... Read more
Jun 03 | ప్రాచీనకాలం నుంచి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి... అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా... Read more
May 07 | కథ : పూర్వం ఒకానొక సమయంలో ఒక మహారాణి తనకోసం, తన తనయుల కోసం, తన రాజ్యంలో వున్న వారందరి శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం మూల గౌరీ నోమును నోచుకుంటుంది. నోము కాలం అయిన... Read more
Apr 17 | కథ : పూర్వం ఒక రాజు కూతురు, బ్రాహ్మణ కూతురు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని గడిపేవారు. వీరిద్దరి జీవితంలో ఏ ఒక్క లోటు వుండేది కాదు. అయితే ఒకరోజు వీరిద్దరూ... Read more
Apr 16 | కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు... Read more