కార్తీకమాసంలో ఎంతో పవిత్రమైన, విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశిరోజు తులసీ పూజను నిర్వహించుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్షద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు ముత్తైదువులు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలను భక్తిశ్రద్ధలతో పూజించి, వారి వివాహాన్ని జరుపుకుంటారు. ఆ సందర్భంగానే ఈ తులసీపూజను కూడా చేస్తారు.
తులసీపూజా విధానం :
మొదటగా మన ఇంటిముందు నిర్మించుకున్న తులసీకోట ముందు అయితే పద్మాలు వేసి.. వాటిమీద దీపాలను వుంచాలి. అనంతరం తులసీదేవిని, శ్రీమహావిష్ణువును సమేతంగా పూజించుకోవాలి.
అయిదు రకాల నైవేద్యాలను, పండ్లను, తాంబూలాలను సమర్పించుకోవాలి. ప్రదక్షిణ, నమస్కారాలతో కార్తీకశుద్ధ ఏకాదశివరకు పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవాలి.
కార్తీకశుద్ధ ఏకాదశిరోజు ఉపవాసం వుండి, పూజలు నిర్వహించుకోవాలి. అనంతరం తులసీదేవిని, లక్ష్మీనారాయణలను అర్చించుకోవాలి. ఆరోజు రాత్రంతా జాగరణ చేయాలి.
ద్వాదశిరోజు బియ్యపు పిండితో మూడు ముద్దలను తయారుచేసి.. వాటిని నివేదించాలి. ఒకటి తులసి దగ్గర, రెండవదాన్ని బ్రాహ్మణుడికి, మూడోదాన్ని రోటిలో వుంచి.. పాలుపోసి చెరుకుగడలతో దంచాలి. ఇలా చేయడంవల్ల మనం చేసిన పాపాలను నుంచి విముక్తి కలిగి, పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే మాంగళ్య వృద్ధి, సర్వసుఖాలు, పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jun 12 | హిందూ శాస్త్రాలలో పాదరసం ప్రాముఖ్యత - మహిమలు : పూర్వం దేవతల కాలంనుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. పాదరసం అసలు పేరు ‘‘ఏఅసరాజు’’. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీనకాలంలో... Read more
May 10 | హిందూ దేవతలలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలు కూడా తమ పనులను నిర్వర్తించుకునేముందు వినాయకుడిని దర్శించుకుని, విజయాలను సాధించేవారు. అలాగే సామాన్య ప్రజలు కూడా తమరోజువారి పనులలో, కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా... Read more
Apr 18 | అమృత ప్రాప్తి మంత్రం : శంఖినీ యక్షిణీ సాధన మంత్రం శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చుని పదివేలసార్లవరకు జపించాలి. దీనిని... Read more
Mar 19 | భీష్మపితామహుడికి సంతానం లేకపోయినా... ఆయన మరణించిన తరువాత ఇప్పటికీ పితృతర్పణాలు అందుతూనే వున్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భీష్ముడు భారతకథలో నిలిచిపోయిన మహోన్నతుడు. ఈయనకు ఇంత మహత్యం లభించడానికి కారణం ఆయన గుణశీలాలే. 45రోజులపాటు... Read more
Mar 15 | ఆశ్వయుజ అమావాస్యనాడు... అంటే దీపావళి ముగిసిన రెండురోజుల తరువాత కార్తీకమాసం మొదలవుతుంది. ఈ కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజుని వారు శివరాత్రితో సమానమైన పర్వదినంగా కొలుచుకుంటారు. ఈ పర్వదినాన్ని... Read more