భీష్మపితామహుడికి సంతానం లేకపోయినా... ఆయన మరణించిన తరువాత ఇప్పటికీ పితృతర్పణాలు అందుతూనే వున్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భీష్ముడు భారతకథలో నిలిచిపోయిన మహోన్నతుడు. ఈయనకు ఇంత మహత్యం లభించడానికి కారణం ఆయన గుణశీలాలే.
45రోజులపాటు అంపశయ్య మీద వున్న కురువృద్ధుడు భీష్ముడు... భీష్మాష్టమి రోజు తన ఇష్టప్రకారం ప్రాణాలను వదిలాడని చెబుతారు.
మాఘశుద్ధ అష్టమి రోజునే భీష్మాష్టమి అంటారు. ఈ రోజే (భీష్మాష్టమి) భీష్మ పితామహుడు మోక్షప్రాప్తి పొందిన పర్వదినమని పురోహితులు చెబుతుంటారు.
భీష్మాష్టమిరోజు భీష్ముడికి తర్పణం సమర్పించడం వల్ల సంతానప్రాప్తి కలుగుతుందని ప్రతిఒక్కరు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
సాధారణంగా తండ్రులు బతికివున్నవారు తర్పణం ఇవ్వడానికి అర్హులు కారు. కానీ.. భీష్మ తర్పణం సమయంలో అటువంటి నియమాలను ఎవ్వరూ పాటించరు. అంతటి ప్రత్యేకస్థానం ఆయనది.
పూజావిధానం :
భీష్మాష్టమిరోజున ఉదయాన్నే లేచి రోజువారి కార్యక్రమాలను ముగించుకోవాలి. తరువాత తలంటు స్నానం చేసుకుని, పూజామందిరాన్ని - ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ, తోరణాలు పట్టించి.... పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి.
భీష్మాష్టమిరోజు తెలుపురంగు దుస్తులను ధరించడం ప్రాచీనకాలం నుండి వస్తున్న ఆచారం. ఆరోజంతా ఉపవాసం వుండి, రాత్రంతా జాగారం చేయాలి.
పూజాకార్యక్రమాలను మొదలుపెట్టే ముందు... విష్ణుమూర్తి ఫోటోను తీసుకుని - దానికి పసుపు కుంకుమలు, తారమపువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించుకోవాలి.
నైవేద్యం ఇవ్వడం కోసం పాయసం, తీపిపదార్థాలు, ఆకుపచ్చ పళ్లు మొదలైనవి ముందుగానే సిద్ధం చేసుకుని వుంచుకోవాలి.
ముందుగా విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం లేదా ‘ఓం నమోనారాయణాయ’ అనే మంత్రమును 108 సార్లు జపించాలి. ఈ పూజను మధ్యాహ్నం 12 నుంచి 2 గంటలవరకు చేసుకోవచ్చు.
ఈ విధంగా పూజా కార్యక్రమం ముగిసిన తరువాత ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులు వాడాలి. దేవాలయాలలో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, లక్షవత్తుల పూజ వంటివి నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
భీష్మాష్టమి రోజున విష్ణు సహస్ర నామస్తోత్రం, విష్ణుపురాణం, సత్యనారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు, బంధుమిత్రులకు లేదా చుట్టుపక్కల వున్నవారికి తాంబూలంతో ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు. ఇలా చేయడంతో ఎంతో మంచిదని అంటారు.
(And get your daily news straight to your inbox)
Jun 12 | హిందూ శాస్త్రాలలో పాదరసం ప్రాముఖ్యత - మహిమలు : పూర్వం దేవతల కాలంనుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. పాదరసం అసలు పేరు ‘‘ఏఅసరాజు’’. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీనకాలంలో... Read more
May 10 | హిందూ దేవతలలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలు కూడా తమ పనులను నిర్వర్తించుకునేముందు వినాయకుడిని దర్శించుకుని, విజయాలను సాధించేవారు. అలాగే సామాన్య ప్రజలు కూడా తమరోజువారి పనులలో, కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా... Read more
Apr 18 | అమృత ప్రాప్తి మంత్రం : శంఖినీ యక్షిణీ సాధన మంత్రం శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చుని పదివేలసార్లవరకు జపించాలి. దీనిని... Read more
Apr 03 | కార్తీకమాసంలో ఎంతో పవిత్రమైన, విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశిరోజు తులసీ పూజను నిర్వహించుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్షద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు ముత్తైదువులు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలను భక్తిశ్రద్ధలతో పూజించి, వారి వివాహాన్ని జరుపుకుంటారు. ఆ... Read more
Mar 15 | ఆశ్వయుజ అమావాస్యనాడు... అంటే దీపావళి ముగిసిన రెండురోజుల తరువాత కార్తీకమాసం మొదలవుతుంది. ఈ కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజుని వారు శివరాత్రితో సమానమైన పర్వదినంగా కొలుచుకుంటారు. ఈ పర్వదినాన్ని... Read more