అక్షయ తృతీయ ఒక పసిడి రాశుల పర్వదినం. అంటే.. ఈ తృతీయరోజు బంగారు ఆభరణాలను కొనుక్కోవడం చాలా మంచిదని ప్రతిఒక్కరు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం. ఈరోజునాడు అందరు పెద్దపెద్ద ఆభరణాలు కాకపోయినా.. 1 నుంచి 10 గ్రాముల బంగారాన్ని కొనుక్కుని సంతృప్తి చెందుతారు.
అక్షయ అంటే.. తరిగిపోకుండా, క్షీణించకుండా శాశ్వతంగా వుండేది. అందువల్లే ఈరోజు ప్రతిఒక్కరు ఆభరణాలు, స్థలాలు, గృహాలు నిర్మించుకోవడం చేస్తారు. సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. మన అవసరాలకు తగ్గట్టు ఉపయోగపడే వస్తువు. అంటే.. ఆర్థికంగా ఏమైనా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది. అందుకే.. అక్షయ తృతీయరోజు దీనిని కొనడం వల్ల అదృష్టం కలిసివస్తుందని ప్రతిఒక్కరు విశ్వసిస్తారు.
చాలామంది అక్షయతృతీయనాడు ఉపవాసం వుండి.. వసుదేవునికి పూజలు చేసి.. ప్రార్థిస్తారు. ఎంతో పవిత్రదినం అయిన ఈ తృతీయనాడు గంగానదిలో స్నానం చేసుకుంటే పుణ్యం లభిస్తుంది.. వ్యాపార వ్యవహారాలు కూడా మంచిగా నడుస్తాయని నమ్ముతారు.
అక్షయ తృతీయ... వైశాఖమాసంలోని శుక్లపక్షంలో మూడవరోజు వస్తుంది. ఈ పండుగరోజు ఎటువంటి కుల, మత, వర్గాలతో భేదాలు లేకుండా సిరిసంపదలు తెచ్చిపెట్టే లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. హిందువుల, జైనులు ఎంతో విశేషంగా జరుపుకునే ఈరోజును ‘అఖ తీజ్’ అని పేర్కుంటారు.
ఎంతో ధనవంతుడయిన కుబేరుడు కూడా అక్షయ తృతీయనాడు లక్ష్మీదేవిని పూజించాడు. అందుకే కొంతమంది లక్ష్మీ కుబేర హోమాన్ని కూడా నిర్వహించుకుంటారు. మహాలక్ష్మీ దేవాలయలాలు వెళ్లి నాలుగు దిక్కుల నాలుగు నాణాలను వేయడం వల్ల.. సిరిసంపదలు వారింటిముందు చేరుకుంటాయని ఆశిస్తారు.
పూర్వం వేదవ్యాసుడు కూడా ఈ అక్షయతృతీయనాడే మహాభారతాన్ని ఆరంభించాడు. వ్యాసుడు చెబుతుండగా... వినాయకుడు రాసుకుంటూ పోయాడు. విష్ణుమూర్తికి ఆరవ అవతారమైన పరశురాముడు కూడా ఈరోజే జన్మించాడు. త్రేతాయుగం కూడా అక్షయతృతీయనాడే ప్రారంభం అయింది.
పురాణాల కథ :
పూర్వం సర్వసంపదలు కలిగిన తీర్థంకర రిషభదేవ అనే రాజు అయోధ్య రాజ్యంలో వుండేవాడు. అయితే తను తన సంపద మొత్తాన్ని త్యజించి.. జైన సన్యాసిగి జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటాడు. సాధారణంగా జైన స్వాములు త్యాగపరులు. ఆఖరికి వారు తమ ఆహారాన్ని కూడా వండుకోరు. ఒకవేళ దాహమేస్తే.. యాచనకు వెళ్తారు.
ఒకరోజు రిషభదేవునికి తీవ్రంగా ఆకలివేస్తే.. యాచనకు వెళ్లాడు. అయితే అక్కడున్న వారందరు రాజు ఏమడుగుతున్నాడో సరిగ్గా అర్థం కాక అయోమయంలో పడిపోతారు. చివరికి రాజు తమను అభ్యర్థిస్తున్నాడంటే.. అది కేవలం ధనం కోసమే అయింటుందని అయోధ్య ప్రజలందరు ఒక్క ఆహారం తప్ప.. తమ దగ్గరున్న బంగారం, ఆభరణాలు, ఏనుగులు, గుర్రాలు, ఎంతో ఖరీదైన వస్తువులను తెచ్చి ఆరాజు ముందు వుంచుతారు.
దాంతో రిషభదేవుడు చేసేదేమీలేక.. ఒక సంవత్సరం వరకు ఆకలితోనే వుండిపోతాడు. చివరికి ఆయన మనవడు అయిన శ్రేయాంశ కుమారుడు తాతగారి ఆకలిని గ్రహించి చెరుకు రసాన్ని తెచ్చిచ్చాడు. సరిగ్గా అదే రోజు కూడా అక్షయ తృతీయ రోజు. అలా అప్పటినుండి జైనులకు అక్షయతృతీయం ఒక పవిత్రదినంగా మారిపోయింది.
(And get your daily news straight to your inbox)
Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more
Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more
Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more
Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more
Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more