టీషర్ట్ లో రంగు మారింది కానీ .. దీక్ష మానలేదు అనే ప్రతిఒక్కరికి వస్తుంది. ఒక సంవత్సరం పాటు నాలుగు గోడల మద్య ఉన్న నాయకుడు, అదే నాలుగు గోడల ఉండి, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చెయ్యటం, ఆయన ఆరోగ్యం పై ఖంగారుపడిన.. జైలు అధికారులు హుటహుటిన ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చటం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి వరకు జైల్లో ఉన్న నాయకుడు ఎలా ఉన్నాడో అని ఎదురుచూసిన ఆ పార్టీ నాయకులకు, ఆ పార్టీ కార్యకర్తలకు, ఆయన అభిమానులకు.. ఒక్కసారిగా రెడ్ టీషర్ట్ లో కనిపించటం జరిగింది. అయితే ఆయన బయట ఉన్నప్పుడు ఎప్పుడు చారలు చారలు(గీతలు గీసిన) చొక్కలు మాత్రం ధరించి ప్రజల మద్య వచ్చిన విషయం తెలిసిందే. అయితే జైలుకువెళ్లిన తరువాత .. ఆయనలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. టీషర్టు ధరించి నాయకుడుగా జగన్ కొత్త లుక్ లో కనిపించిన విషయం తెలిసిందే. సహజంగా జైలు ఖైదీ అంటే.. సీనిమాల్లో చూపించినట్లు.. తెల్లచొక్క, తెల్లప్యాంటూ, ఖైదీ నెంబరుతో కనిపిస్తారనే విషయం అందరికి తెలిసిందే. అయితే జగన్ విషయంలో అందుకు విరుద్దుగా ఉంది. ఉస్మానియా ఆసుపత్రి లో కనిపించిన జగన్ మాత్రం ఒక సాప్ట్ వేరు ఉద్యోగిలా కనిపించటం కొసమెరుపు.
అయితే ఆయన సమైక్యాంద్రకు మద్దతు గా దీక్ష చేస్తున్నాడు కాబట్టి, ఆయన డ్రెస్ గురించి పెద్ద చెప్పుకోనవసరం లేదు. కానీ ఆయన దీక్షలో ఎలాంటి మార్పులేదు. జైల్లో చేపట్టిన దీక్షను ఆసుపత్రిలో కూడా దీక్షను కంటిన్యూ చెయ్యటమే అందరికి ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఈ రోజు ఆయన్ని ఉస్మానియా నుండి నిమ్స్ కు తరలించటం జరిగింది. ఇక్కడే ఈ టిషర్ట్ విషయం వెలుగులోకి వచ్చిందని ఆయన అభిమానులు అంటున్నారు. ఈ రోజు వైఎస్ జగన్ గ్రీన్ టీషర్ట్ లో కనిపించటంతో ఆందరికి ఆశ్చర్యంగా అనిపించింది. ఎప్పుడు గీతల చొక్కలు ధరించే జగన్ రంగు రంగుల టీషర్ట్ వేస్తూ.. దీక్షను కంటిన్యూ చేయటంతో ఆ పార్టీలోని నాయకులు ఆశ్చర్యపోతున్నారు. టీషర్టు రంగు మారింది గానీ, జగన్ చేస్తున్న దీక్షలో ఎలాంటి మార్పులేదని కొంతమంది డాక్టర్లు, పార్టీ నాయుకులు చెప్పటం విశేషంగా ఉందని జగన్ అభిమానులు అంటున్నారు. ఎన్ని టీషర్ట్ లు మార్చిన, ఎన్ని ఆసుపత్రులు మార్చిన, ఎంతమంది డాక్టర్లు చెప్పిన సరే జగన్ మాత్రం దీక్ష చెయ్యటం మానటలేదని అభిమానులు అంటున్నారు.
ఆ మద్య టిడిపి నుంచి వచ్చిన వైసీపీ చేరిన నాయుకుడు దాడి వీరబాద్రరావు జైల్లో ఉన్న జగన్ కలిసి బయట వచ్చిన తరువాత కొన్ని మాటలకు మీడియాకు, ప్రజలకు పరిచయం చేశాడు. అప్పటి జగన్ వేరు, నేను కలిసిన జగన్ వేరు. జగన్ లో నాకు ఒక నిజమైన నాయకుడు కనిపించాడని మీడియా ముందు దైర్యంగా చెప్పిన మాటలను సీమాంద్ర ప్రజలు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. అవును జైలు వెళ్లకముందు జగన్ వేరు.. ఇప్పటి జగన్ వేరు అని ఆపార్టీ నాయకులే అంటున్నారు. అయితే జగన్ లో వచ్చిన మారు ఎటు వైపు దారితీస్తుందో చూడలని ఆయన అభిమానులు అంటున్నారు. రాష్ట్ర విభజన ప్రకటన తరువాత అనేక మంది ఆమరణ నిరాహర దీక్షలు చేయటం జరిగింది. ఆ దీక్షలన్నీ అయిదురోజులు దీక్షలుగానే మిగిలిపోయిన విషయం తెలిసిందే. అన్నీ దీక్షలు అర్థరాత్రే భగ్నం జరిగింది. కానీ ఆసుపత్రిలో ఉండి దీక్షలు చేసిన వారు ఎవరు లేరు. ఇప్పుడు జగన్ తప్ప. వైఎస్ జగన్ ఆసుపత్రిలో ఎన్నిరోజలు దీక్ష చేస్తారో వేచి చూడాలి. జగన్ చేసే దీక్ష పైనే సీమాంద్ర ఉద్యమం ఊపిరి ఉందని ఆపార్టీ నాయకులు అంటున్నారు. ఏం జరగుతుందో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more