కరెంట్ చార్జీల తగ్గింపు కోసం దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ..చార్జీ పవర్ తగ్గిపోతుంది. రీచార్జీ చేసుకోవటానికి ఇప్పటికే ఒక మహిళ ఎమ్మెల్యే వనిత ఆస్పత్రి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ నాయకులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఐదురోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. విద్యుత్ సమస్యలకు నిరసనగా వారు చెపట్టిన దీక్ష కు భారీ మద్దతు లభించింది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. దీనిపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నేతల ఆరోగ్య పరిస్థితి విషమమంగా తయారైందని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై కాంగ్రెస్ పార్టీ కుట్ర సాధిస్తుంది, ఐదు రోజుల నుండి దీక్ష చేస్తున్న కిరణ్ సర్కార్ పట్టించుకోలేదని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. రాజకీయ నాయకులు అంటే.. వారిలో బిపీ , షూగర్ లాంటి ఎక్కువుగా ఉంటాయి. దీక్ష చేస్తున్న నేతల్లో బిపీ, షూగర్ లేవల్స్ పడిపోతే. మా నేతల పరిస్థితి ఏమిటి? అని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన రాజకీయ పార్టీలకు ఒక న్యాయం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో న్యాయం ఏమిటని వారు అడుగుతున్నారు. రీసెంట్ గా ఇందిరా పార్కు వద్ద వామపక్షాలు చేస్తున్న దీక్ష శిబిరం పై అర్థరాత్రి దాడి చేసి, ఆ పార్టీ నాయకులను ఆస్పత్రి తరలించిన విషయం వైసీపీ నేతలు గుర్తు చేశారు. ఆ నాయకుల పట్ల ఉన్న శ్రద్ద .. మా పార్టీ నాయకుల మీద ఎందుకు ఉండదని ఆపార్టీ సీనియర్ నాయకులు అడుగుతున్నారు. మా పార్టీ నేతలకు ఏమైన జరిగితే.. రాష్ట్రంలో నిరసనల అలజడి పుట్టిస్తామాని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రజల కోసం దీక్షలు చేస్తున్న మా పార్టీ నేతలపై చిన్నచూపు పనికిరాదని, ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more