కూటమికే కాదు.. సమాజానికీ ఆమోదయోగ్యులు కావాలి, అలాంటి 'అభ్యర్థి'ని మాత్రమే ఆమోదిస్తాం నితీశ్ కుమార్ అంటున్నారు. తాను రేసులో లేనని చెబుతున్నారు. కానీ నితిష్ ఇది తగిన సమయం కాదని బీజేపీ అంటుంది. ఒకవైపు రాష్ట్రపతి అభ్యర్థినే ఖరారు చేసుకోలేక సతమతమవుతున్న ఎన్డీఏపై బీహార్ ముఖ్యమంత్రి, ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన జేడీయూ నేత నితీశ్ కుమార్ ‘లౌకికాస్త్రాన్ని’ సంధించారు. ప్రధాని అభ్యర్థిగా లౌకిక విలువలున్న నేతనే ఎంపిక చేయాలని ఆయన సూచించారు. దీంతో ఎన్డీఏలో విభేదాలు రచ్చకెక్కినట్లయింది. బీజేపీ 'ప్రధాని' అభ్యర్థి నరేంద్రమోడీని అంగీకరించేది లేదంటూ పరోక్షంగా కుండబద్దలు కొట్టి, ఆ పీఠంపై తమకూ ఆలోచన ఉన్నదని చెప్పకనే చెప్పారు. ఎన్డీయే శిబిరంలో 'ప్రధాని' అభ్యర్థిగా మోడీ తరువాత ఆ స్థాయిలో వినిపిస్తున్న పేరు బీహార్ సీఎం నితీశ్కుమార్దే. ఇప్పుడు ఆయనే ఈ మొత్తం వ్యవహారాన్ని తెరపైకి తేవడం..తేనెతుట్టెను ఒక్కసారిగా కదిలించినట్టయింది. ఎన్డీయే ప్రధాని అభ్యర్థి ఎవరైనా.. తప్పక లౌకిక భావనలు కలిగి ఉండాలని నితీశ్కుమార్ తేల్చిచెప్పారు.
భారతదేశం వంటి విభిన్న మతాలు, బహు భాషలు కలిగిన దేశంలో నేత కాగోరేవారి వ్యక్తిత్వం కటువుగా ఉండరాదు. ఏ పరిస్థితిలోనైనా ఇమిడిపోయేవారిని నేతగా ఎంపిక చేసుకున్నప్పుడే కూటమి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతుందన్నారు. నేరుగా మోడీ పేరు ప్రస్తావించకపోయినా..ప్రధాని అభ్యర్థిత్వానికి ఆయన పనికిరాడని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకం, సమాజంలోని అన్నివర్గాల్లో ఆమోదం కలిగిన నాయకుడే ఆ పదవికి పోటీపడేందుకు అర్హుడని తేల్చేశారు. నాయకుడనేవాడు (ప్రధాని) ఎన్డీయేలోని అన్ని పక్షాలకు ఆమోదయోగ్యుడై ఉండాలి. కూటమి నిర్ణయించే నేత తప్పక లౌకిక విలువలకు కట్టుబడి ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని పేర్కొన్నారు. అదేసమయంలో తాను ప్రధాని రేసులో లేనని స్పష్టం చేశారు. పెద్దపార్టీల నుంచే ప్రధాని రావాలి. ఈ క్రమంలో మేము సహాయక పాత్రను మాత్రమే పోషించగలం. అయితే, కూటమిని ఎవరు నడిపిస్తారనే దాన్ని బట్టే ఆ పాత్ర ఆధారపడి ఉంటుంది' అని పేర్కొన్నారు. ఆ నడిపించే నాయకుడు మోడీ అయితే తాము దూరంగా ఉంటామనే సంకేతాలను ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన బీజేపీ అధిష్ఠానానికి చేర్చారు.
కాగా, నితీశ్ కుమార్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఒక ప్రజాస్వామిక దేశానికి ప్రధాని అయ్యేవారు తప్పక లౌకికవాది అయిఉండాలని కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. మరోవైపు తన ప్రత్యర్థి నితీశ్పై ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ గురిచూసి ప్రశ్నలు సంధించారు. ఎన్డీయేలో లౌకిక నేత ఎవరో చెప్పాలని సవాల్ విసిరారు. బీహార్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ వంటి మతతత్వ శక్తులతో కలిసి అధికారం అనుభవిస్తున్న నితీశ్.. లౌకికవాదం గురించి మాట్లాడటం ఏమిటి అని నిలదీశారు. ఇదంతా ప్రధాని అభ్యర్థి కావడానికి నితీశ్ పన్నిన వ్యూహంగా కొట్టిపడేశారు. ఈ పరిణామంపై బీజేపీ మాత్రం ఆచితూచి స్పందించింది. ప్రధాని అభ్యర్థిత్వం గురించి మాట్లాడేందుకు ఇది తగిన సమయం కాదని ఆపార్టీకి చెందిన బీహార్ ఉపసీఎం సుశీల్ మోడీ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more