Sarkaru Vaari Paata Trailer: Full Dose Action Entertainer నేను ఉన్నాను.. నేను విన్నాను.. సర్కారువారి పాట ట్రైలర్‌..

Sarkaru vaari paata trailer mahesh babu promises a crowd pleasing movie

Sarkaru Vaari Paata, Sarkaru Vaari Paata trailer, mahesh babu, Sarkaru Vaari Paata movie, Keerthy Suresh, Sarkaru Vaari Paata movie trailer, Sarkaru Vaari Paata release date, Sarkaru Vaari Paata, official trailer, Mahesh babu, Keerthy suresh, parasuram, Thaman, Mythri Movie Makers, 14 Reels Plus, Tollywood, Movies, Entertainment

The hype has already been high on Mahesh Babu’s “Sarkaru Vaari Paata”. The trailer has added fuel to the fire, raising expectations further. Mahesh Babu’s swag and dialogues with terrific mass blocks are the highlight of the trailer. Vizag is the story’s setting. Mahesh Babu and Keerthy Suresh’s romance are cute and entertaining.

నేను ఉన్నాను.. నేను విన్నాను.. సర్కారువారి పాట ట్రైలర్‌..

Posted: 05/02/2022 05:27 PM IST
Sarkaru vaari paata trailer mahesh babu promises a crowd pleasing movie

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మూవీలో ఉండాల్సిన అన్ని హంగులతో రాబోతోంది సర్కారు వారి పాట. లవర్‌ బోయ్‌గా కనిపిస్తూనే కామెడీ టైమింగ్‌, పంచ్ డైలాగులు, ఇరగదీసే ఫైట్లతో ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌ మధ్యలో మహేష్‌ శ్రీకాకుళం యాసలో చెప్పిన డైలాగులు ఫన్నీగా ఉన్నాయి. కీర్తి సురేశ్‌ చాలా అందంగా కనిపిస్తోంది. బ్యాంక్‌ స్కామ్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో మహేష్‌ అభిమానులకు కావాల్సిన యాక్షన్‌, కామెడీ, రొమాన్స్‌లను చేర్చినట్లుగా ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. నా ప్రేమను దొంగలించగలవ్.. నా స్నేహాన్ని దొంగలించగలవ్.. కానీ నా డబ్బును మాత్రం దొంగలించలేవ్ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఇక నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు తరచూ కొట్టే డైలాగ్ ను మహేష్ నోటి వెంట అనిపించడం ట్రైలర్ కే హైలైట్. ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ ఇప్పటికే హిట్ టాక్ ను సోంతం చేసుకున్నాయి. కళావతి, ఎవ్రీ పెన్నీ లాంటి సాంగ్స్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.

మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంతోని ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ చిత్రం తర్వాత మహేష్‌.. త్రివిక్రమ్ డైరక్షన్‌లో ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది కాకుండా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితోనూ ఓ చిత్రం చేయబోతున్నారు మహేశ్. ఈ సినిమా కోసం సూపర్‌స్టార్‌తో పాటు అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles