Balakrishna’s ‘Akhanda’ locks release date బాలయ్య ‘అఖండ’ విడుదలకు ముహూర్తం ఫిక్స్.!

Balakrishna s akhanda to release ahead of s s rajamouli s rrr

Akhanda, Release date, BalaKrishna, Pragyna jaiswal, Poorna, Srikanth, Boyapati Srinu, Miryala Ravinder Reddy, Tollywood, Movies, Entertainment

Nandamuri Balakrishna’s 'Akhanda' has been in making for a long now. As per the latest reports, the makers are considering a new release date yet again for ‘Akhanda’, But this time it is not a postponement but a pre-pone date that is considered by the makers. The team is gearing up to release the movie on December 2.

బాలయ్య ‘అఖండ’ విడుదలకు ముహూర్తం ఫిక్స్.!

Posted: 11/01/2021 07:23 PM IST
Balakrishna s akhanda to release ahead of s s rajamouli s rrr

యువరత్న నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన పలు చిత్రాలు బాక్సీఫీసు వద్ద దుమ్మురేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో రూపోందిన 'అఖండ' విడుదలకు రెడీ కానుంది. ప్రస్తుతం పోస్టు ప్రోడక్షన్ పనుల్లో వున్న ఈ చిత్రం డిసెంబర్ లో ప్రపంచవ్యాప్త తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం యోచనలో వుంది. అయితే అందుకు మొదట డిసెంబర్ 24ను ముహూర్తంగా ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో తేదీని కన్ఫామ్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

తొలుత ఈ సినిమా దసరా బరిలో నిలపాలని చిత్రబృందం భావించినా.. ఆ తరువాత కనీసం దీపావళి బరిలోకైనా సిద్దం చేయాలని అనుకున్నారు. అయితే పోస్టు పోడ్రక్షన్స్ పనిలో కొంత జాప్యం కారణంగా ఈ చిత్రాన్ని క్రిస్మస్ పండగను పురస్కరించుకుని డిసెంబర్ 24న విడుదల చేయాలని భావించారు. అయితే డిసెంబర్ 24 ఫిక్స్ అని చిత్రపురిలో గుసగుసలు వినిపించినా.. తాజాగా అది కూడా కాదని.. మళ్లీ తేదీ మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి వాయిదా పడలేదు కానీ కాసింత ముందుకు జరిగింది. చిత్ర నిర్మాతలు కూడా ఈ డేట్ ను ఖాయం చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇంతకీ ఆ తేదీ ఎప్పుడు.? అని అంటారా.? డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా త్వరలోనే ఎనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ .. అఘోరా ఎపిసోడ్ .. తమన్ స్వరపరిచిన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా శ్రీకాంత్ కనిపించనున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. బాలకృష్ణ సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ నటించగా, ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. ఈ సినిమాలో రైతుగా .. అఘోరగా బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles