సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ అభిమానులకు అపోలో ఆసుపత్రి గుడ్ న్యూస్ చెప్పింది. రిపబ్లిక్ హీరోకు పూర్తిగా వెంటిలేటర్ ను తొలగించిన ఆసుపత్రి వైద్యులు.. ఆయన మరో రెండ మూడు రోజుల వ్యవధిలో ఆసుపత్రి నుంచి డిశ్చార్ అవుతారని ఫ్యాన్స్ కు శుభవార్తను అందించారు వైద్యులు. ఆయన త్వరగా కోలుకోవాలని ఎందరో భక్తులు ఎన్నో రకాలుగా దేవుడిని ప్రార్థించారు. కోందరు మోకాళ్ల మొక్కులు కూడా తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వెంటిలేటర్ ను తోలగించిన వైద్యులు ఆయనను మరో మూడు రోజుల్లో డిశ్చార్జీ చేస్తామని చెప్పడం అభిమానులకు ఆనందాన్ని అందించింది.
సెప్టెంబర్ 10న ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. వినాయక చవితి రోజు రాత్రి ఎనిమిది గంటలకు సాయితేజ్ కేబుల్ బ్రిడ్జ్-ఐకియా మార్గంలో బైక్ పై వేగంగా వెళ్తుండగా.. అక్కడ రోడ్డుపై ఇసుక ఉండటంతో అన్ని వాహనాలు నెమ్మెదించగా, ఆయన కూడా బైక్ బ్రేక్స్ అప్లై చేస్తున్న క్రమంలో అది కాస్తా స్కిడ్ అయ్యింది. దీంతో కిందపడిన సాయి తేజ గాయపడ్డాడు. వెంటనే ఆయనను మెడికవర్ ఆసుపత్రికి తరలించి ప్రాథమికి చికిత్స అందించారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీలోని పెద్దలు అసుపత్రికి చేరుకుని ఆయనను హుటాహుటిన అపోలో హాస్పిటల్కు తరలించారు. కాలర్ బోన్ విరిగడంతో దానికి శస్త్రచికిత్స చేశారు.
దాదాపు పది రోజులు వెంటిలేటర్పై ఉన్న సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మెరుగుపడింది. ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్ తొలగించినట్లు వైద్యబృందం సోమవారం వెల్లడించింది. సాయిధరమ్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామని, ఇప్పుడు సొంతంగా శ్వాస తీసుకుంటున్నట్టుకూడా పేర్కొన్నారు. రెండు మూడురోజులలో సాయిధరమ్ డిశ్చార్జ్ కానున్నట్టు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుండగా, ఇందులో సాయితేజ్ ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఆయన సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more