దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్ డేట్ కోసం గత కొన్ని రోజులుగా అభిమానులు వేచిచూస్తన్న విషయం తెలిసిందే. ఒలీవియా మోరిస్ అనుకోకుండా రెండు రోజుల క్రితం లీక్ చేసిన ఈ చిత్రానికి సంబంధించిన విషయం తెలిసనప్పటి నుంచి అభిమానులు.. ఔనా ఇది నిజమేనా అంటూ సినీవార్తల పట్ల సోషల్ మీడియాలో కథనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే.. చిత్ర విడదలకు ముహూర్తం ఫిక్స్ అయిందా.. అనేదే.
ఇదివరకే పలు పర్యాయాలు విడుదల తేదీలు ప్రకటించిన వాయిదా పడిన చిత్రం.. ఇక కరోనా మహమ్మారి నేపథ్యంలో చిత్రల షూటింగ్ కు బ్రేక్ పడటంతో.. మరోమారు చిత్ర విడుదల తేది వాయిదా పడింది. అయితే ఇంతకీ ఈచిత్రం విడుదల ఎప్పుడంటూ అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానులతో పాటు దర్శక ధీరుడి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు తాజా అప్ డేట్ ఇస్తామంటూ అకట్టుకున్న చిత్ర యూనిట్ ప్రకటన.. అభిమానుల ఎదురుచూపులకు విరామం కల్పిస్తూ చిత్ర విడుదల తేదీని ఫిక్స్ చేసింది.
మెగాపవర్ స్టార్ రాంచరణ్, నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఇద్దరు యంగ్ హీరోలతో కూడిన కొత్త పోస్టర్ ను విడుదల చేసిన చిత్రబృందం.. చక్కటి క్యాప్షన్ ను కూడా పెట్టింది. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ గుర్రంపై దూసుకెళ్తుండగా, తారక్ బుల్లెట్ పై వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అభిమానులను ఎంతగానో అకర్షిస్తోన్న ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసిన చిత్రబృందం.. దానికి మరింత జోష్ ను నింపేలా కొటేషన్ రాసింది.
ఈ ఏడాది అక్టోబర్ 13న నీరు-నిప్పు కలిసి మీ ముందుకు వస్తున్నాయి. గతంలో మీరు ఎప్పుడూ చూడని, వినని అత్యంత ప్రభావం కలిగిన శక్తి మీ ముందు అవిష్కృతం కానుంది. భారతీయ సినిమాలో ఈ అతిపెద్ద శక్తుల కలయిన అద్భుతమైన అనుభూతిని ఇవ్వనుంది. ఈ అనుభవాన్ని మీరు అందుకునేందుకు సిద్దంగా వుండండీ అంటూ చిత్ర బృందం కొటేషన్ రాసింది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ లు హీరోయిన్లుగా నటించనున్నారు. వీరితోపాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని ఇతర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more