Mahesh Babu to launch his own OTT platform సూపర్ స్టార్ మహేష్ బాబు నయా బిజినెస్ ప్లాన్..

Mahesh babu to launch his own digital streaming platform

Mahesh Babu, Mahesh Babu OTT platform, Adivi Sesh, super star, AMB cinema, Textile business, tollywood, movies, entertainment

After venturing into film manufacturing and textile enterprise, Mahesh Babu is all set to launch his personal OTT platform. There have been studies doing rounds on social media that Mahesh Babu has finalized a cope with an current OTT platform and will likely be making authentic contents for them

సూపర్ స్టార్ మహేష్ బాబు నయా బిజినెస్ ప్లాన్..

Posted: 04/14/2020 08:56 PM IST
Mahesh babu to launch his own digital streaming platform

లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన టాలీవుడ్ స్టార్స్ కొత్త సినిమాల కోసం ప్రిపేర్ అవుతూ.. దర్శకులు తీసుకువచ్చే కథలను వింటున్నారు. ఇదే సమయంలో తమ ఫ్యామిలీలకు కూడా పూర్తి సమయాన్ని కేటాయిస్తు ఆనందంగా గడుపుతున్నారు. కరోనా వైరస్ కు మాత్రం సీనీప్రముఖుల కుటుంబసభ్యులు ఓ విధంగా థ్యాంక్ చెప్పాల్సిందే. ఎందుకంటే నిత్యం బిజీగా వుండే ప్రముఖులు గత ఇరవై రోజులుగా ఇంటిపట్టునే వుండేట్లు చేయడంతో పాటు తమ పూర్తి సమయాన్ని తమతోనే గడపుతున్నారు. ఇక హీరోలు పలు సినిమా స్ర్కిప్టు వర్కులకు కూడా సమయాన్ని కేటాయిస్తున్నారు.

లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత ఇక వరుసబెట్టి తమ సినిమాలను వరుసగా తెరకెక్కించే పనిలో బాగంగా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే మే 3వ వరకు లాక్ డౌన్ పోడగిస్తున్నట్లు ఇవాళ ప్రధాని మోడీ ప్రకటన వెలువరించడంతో.. ఇక మరోమారు లభించిన 19 రోజుల సమయాన్ని కూడా ఇందుకు కేటాయించనున్నారు సినీహీరోలు. ఇష్టమైన పనులు చేస్తూ.. బిజినెస్ వ్యవహారాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో కొత్త ఫీల్డ్‌లోకి ఎంటరవబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఏషియన్ గ్రూప్‌‌తో కలిసి ఏఎంబీ సినిమాస్, హంబుల్‌తో టెక్స్‌టైల్ రంగంలోకి ప్రవేశించిన మహేష్ ఇప్పుడు డిజిటల్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినబడుతున్నాయి.

ఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో సినిమా నిర్మాణ రంగంలో కొనసాగుతున్న మహేశ్.. ఇదే పేరుతో సొంతగా ఓటీటీ స్టార్ట్ చేయబోతున్నాడట. దీనికి సంబంధించి ఇప్పటికే ముంబైలోని ఓ పెద్ద నిర్మాణ సంస్థతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు సమాచారం. అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ఇటీవల ‘ఆహా’ పేరుతో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలి తెలుగు ఓటీటీగా ‘ఆహా’ గుర్తింపు తెచ్చుకుంటోంది. లాక్‌డౌన్ తర్వాత మహేశ్.. ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ప్రారంభం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles