కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో రోజువారీ వేతనానికి పనిచేసే ఎంతో మంది కార్మికులను అదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసెన్ ఛారిటీ స్థాపించిన విషయం తెలిసిందే. దినసరి వేతనాలపై ఆధారపడిన కుటుండాలను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ పెద్దలు ముందుకొచ్చారు. చిరంజీవి స్వయంగా కోటి రూపాయలు అందజేశారు. అలాగే అక్కినేని నాగార్జున కోటి రూపాయలు ఇచ్చారు. ఇక మిగిలిన స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ వంతు సాయం అందించారు. మొత్తంగా ఏడు కోట్ల రూపాయలను విరాళంగా సేకరించారు.
ఈ డబ్బుతో 12000 కార్మిక కుటుంబాలకు నెలరోజులకు సరిపడా నిత్యావసరాలను సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించారు. అయితే, కరోనా వైరస్ భయాందోళన నేపథ్యంలో ఎంతటి భద్రతల నడుమ ఈ వస్తువుల ప్యాకింగ్ జరుగుతుందో చూడావచ్చునని తాజాగా చిరంజీవి ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఈ వీడియోలో వీక్షించవచ్చేనని చెప్పారు. అత్యంత ఉన్నత ప్రమానికలు పాటించి ప్యాకింగ్ చేస్తున్న దృష్యాలను ఈ వీడియోలో కనిపించాయి.
‘‘కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సినీ పరిశ్రమలో రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికులకు నిత్యావసరాలను సరఫరా చేస్తున్నాం. ఈ ప్రక్రియలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవసరం అనుకున్నవాళ్లకి డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇలాంటి మానవత్వంతో కూడిన మిషన్లో భాగమైన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని చిరంజీవి ట్వీట్లో పేర్కొన్నారు. ఇంట్లో అవసరమైన పప్పులు, పిండిలను చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తున్న విధానాన్ని చిరంజీవి ట్వీట్ చేసిన వీడియోలో చూడొచ్చు. ఈ లాక్డౌన్ సమయంలో తమ కార్మికులు ఆహారం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సినీ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.
The food supplies being distributed to the daily wage workers of film industry by #CoronaCrisisCharity are being handled with all due care and being door delivered to the needy. I thank everyone involved in this humanitarian mission. pic.twitter.com/ENgA2UEgZg
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2020
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more