కరోనా వైరస్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో లింక్ తెంచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. సినీపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న దినసరి వేతన కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన కరోనా క్రైసెస్ ఛారిటీకి పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులతో పాటు నిర్మాతలు, దర్శకులు, రచయితల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అనేక మంది ప్రముఖులు.. తమ రంగంలోని కార్మికులను అదుకునేందుకు విరాళాలను అందజేస్తున్నారు.
ఈ క్రమంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను, సినీరంగంలోని దినసరి కార్మికులను, పేదలను ఆదుకోవడానికి చిరంజీవి నేతృత్వంలో ఏర్పడిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మార్చి నెల 31వ తేదీకే సుమారు 6.2 కోట్ల రూపాయల విరాళాలను ఈ ఛారిటీ సమకూర్చుకుంది. ఈ విషయాన్ని అప్పట్లో చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సాయం చేయాలని కోరారు.
ఆ తరువాత నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా చిరంజీవి సిసిసి ఛారిటీకి విరాళం ఇచ్చారు. పేద సినీరంగ కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేయడంతో పాటు క్లిష్ట సమయంలో మేమున్నామన్న ధైర్యాన్ని ఇచ్చేందుకు బాలయ్య 25 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఇక తాజాగా రోజు వారీ సినీ కార్మికులను ఆదుకునే నిమిత్తం అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రొడ్యూసర్ పద్మావతి గల్లా ముందుకొచ్చారు. కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి విరాళంగా రూ.10 లక్షలు అందజేశారు.
అదే విధంగా, ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, హీరో ఆది సాయికుమార్ లు కూడా సీసీసీకి రూ. 5,00,004 విరాళంగా సమర్పించారు. దీంతో చిరంజీవి కరోనా క్రైసెస్ ఛారిటీకి అన్ని విభాగాల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్ కు కూడా సాయికుమార్ రూ. 1,00,008 విరాళంగా ఇచ్చారు. ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, సాయి కుమార్ సోదరుడు రవి శంకర్ కూడా ఒక లక్ష రూపాయల విరాళాన్ని డబ్బింగ్ యూనియన్ కు విరాళంగా ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more